ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు అభినందనలు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథం వైపు ముందుకు సాగేలా అడుగులు వేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏపీకి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, గతంలో ఆయన నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కచ్చితంగా చక్కటి సంబంధాలు ఏర్పడి ఇరు రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ గెలిచారని, వారిద్దరూ పరస్పర సహకారం అందించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
అదేవిధంగా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడా సహకరించుకుంటారని అంటున్నారు. 2019, 2024 ఈ రెండు ఎన్నికలలో ఒకరికి ఒకరు సహకారం అందించుకునే వారే గెలిచారని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఏపీలో జగన్ గెలిచి ఉంటే రేవంత్ తో సత్సంబంధాలు ఉండేవో కాదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 4, 2024 9:44 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…