ఏపీలో ట్రెండ్ మారుతోంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ట్రెండ్లో నూ దిగువకు పడుతూ వచ్చిన వైసీపీ మధ్యాహ్నం 1 గంటల సమయానికి మరింత దిగజారింది. నిజానికి 2019లో 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈ సారికి వచ్చే సరికి తొలి ట్రెండ్స్లో 14 నుంచి ప్రారంభమై.. 25 వరకు వెళ్లింది. అయితే.. కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో ప్రతి విడతలోనూ.. వైసీపీ దిగజారి పోయింది.
దీంతో మధ్యాహ్నం 1 గంటల సమయానికి 18 స్థానాలకు పడిపోయింది. దీంతో వైసీపీ అధినేత కానీ.. ఇతర కీలక నాయకుల కానీ.. ఎవరూ కూడా బయటకు రాలేదు. కనీసం మీడియా ముందుకు కూడా ఎవరూ రాలేదు. మరోవైపు సీఎం జగన్.. తన ఇంట్లోనే పరిమితమయ్యారు. ముఖ్య నాయకులతో ఆయన చర్చిస్తు న్నారు. ఇక్కడ కీలక విషయం.. ట్రెండ్స్పై ఇక, వైసీపీకి ఆశలు పోయాయి. ఇక, గెలుస్తామన్న ఆలోచన నుంచి..ఇప్పుడు కనీసం ప్రతిపక్షం హోదా అయినా దక్కించుకుంటామా? అనే స్థాయికి పడిపోయారు.
దీంతో వైసీపీలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి మారిపోయింది. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా.. కనీసం 67 స్థానాలైనా దక్కించుకుంది. కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారవడం కాదు .. అత్యంత దారుణంగా మారిపోయింది. ఎన్నడూ ఊహించని స్థాయిలో.. కనీసం కలలో కూడా.. జగన్ ఊహించని స్థాయిలో ఇప్పుడు వైసీపీ 15-18 స్థానాలే దక్కనున్నాయని అంటున్నారు. ఇదే జరిగితే కోరం ప్రకారం.. 10 శాతం మేరకు వైసీపీకి సీట్లు దక్కక పోతే.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కే పరిస్థితి లేకుండాపోతుంది.
This post was last modified on June 4, 2024 1:13 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…