ఏపీలో ట్రెండ్ మారుతోంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ట్రెండ్లో నూ దిగువకు పడుతూ వచ్చిన వైసీపీ మధ్యాహ్నం 1 గంటల సమయానికి మరింత దిగజారింది. నిజానికి 2019లో 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈ సారికి వచ్చే సరికి తొలి ట్రెండ్స్లో 14 నుంచి ప్రారంభమై.. 25 వరకు వెళ్లింది. అయితే.. కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో ప్రతి విడతలోనూ.. వైసీపీ దిగజారి పోయింది.
దీంతో మధ్యాహ్నం 1 గంటల సమయానికి 18 స్థానాలకు పడిపోయింది. దీంతో వైసీపీ అధినేత కానీ.. ఇతర కీలక నాయకుల కానీ.. ఎవరూ కూడా బయటకు రాలేదు. కనీసం మీడియా ముందుకు కూడా ఎవరూ రాలేదు. మరోవైపు సీఎం జగన్.. తన ఇంట్లోనే పరిమితమయ్యారు. ముఖ్య నాయకులతో ఆయన చర్చిస్తు న్నారు. ఇక్కడ కీలక విషయం.. ట్రెండ్స్పై ఇక, వైసీపీకి ఆశలు పోయాయి. ఇక, గెలుస్తామన్న ఆలోచన నుంచి..ఇప్పుడు కనీసం ప్రతిపక్షం హోదా అయినా దక్కించుకుంటామా? అనే స్థాయికి పడిపోయారు.
దీంతో వైసీపీలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి మారిపోయింది. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా.. కనీసం 67 స్థానాలైనా దక్కించుకుంది. కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారవడం కాదు .. అత్యంత దారుణంగా మారిపోయింది. ఎన్నడూ ఊహించని స్థాయిలో.. కనీసం కలలో కూడా.. జగన్ ఊహించని స్థాయిలో ఇప్పుడు వైసీపీ 15-18 స్థానాలే దక్కనున్నాయని అంటున్నారు. ఇదే జరిగితే కోరం ప్రకారం.. 10 శాతం మేరకు వైసీపీకి సీట్లు దక్కక పోతే.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కే పరిస్థితి లేకుండాపోతుంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…