ఏపీలో ట్రెండ్ మారుతోంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ట్రెండ్లో నూ దిగువకు పడుతూ వచ్చిన వైసీపీ మధ్యాహ్నం 1 గంటల సమయానికి మరింత దిగజారింది. నిజానికి 2019లో 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈ సారికి వచ్చే సరికి తొలి ట్రెండ్స్లో 14 నుంచి ప్రారంభమై.. 25 వరకు వెళ్లింది. అయితే.. కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో ప్రతి విడతలోనూ.. వైసీపీ దిగజారి పోయింది.
దీంతో మధ్యాహ్నం 1 గంటల సమయానికి 18 స్థానాలకు పడిపోయింది. దీంతో వైసీపీ అధినేత కానీ.. ఇతర కీలక నాయకుల కానీ.. ఎవరూ కూడా బయటకు రాలేదు. కనీసం మీడియా ముందుకు కూడా ఎవరూ రాలేదు. మరోవైపు సీఎం జగన్.. తన ఇంట్లోనే పరిమితమయ్యారు. ముఖ్య నాయకులతో ఆయన చర్చిస్తు న్నారు. ఇక్కడ కీలక విషయం.. ట్రెండ్స్పై ఇక, వైసీపీకి ఆశలు పోయాయి. ఇక, గెలుస్తామన్న ఆలోచన నుంచి..ఇప్పుడు కనీసం ప్రతిపక్షం హోదా అయినా దక్కించుకుంటామా? అనే స్థాయికి పడిపోయారు.
దీంతో వైసీపీలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి మారిపోయింది. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా.. కనీసం 67 స్థానాలైనా దక్కించుకుంది. కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారవడం కాదు .. అత్యంత దారుణంగా మారిపోయింది. ఎన్నడూ ఊహించని స్థాయిలో.. కనీసం కలలో కూడా.. జగన్ ఊహించని స్థాయిలో ఇప్పుడు వైసీపీ 15-18 స్థానాలే దక్కనున్నాయని అంటున్నారు. ఇదే జరిగితే కోరం ప్రకారం.. 10 శాతం మేరకు వైసీపీకి సీట్లు దక్కక పోతే.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కే పరిస్థితి లేకుండాపోతుంది.
This post was last modified on June 4, 2024 1:13 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…