Political News

డిపాజిట్ జారీ గల్లంతయ్యిందే !

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికలలో అసలు పోటీ చేయకుండానే పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప ఎంపీగా పోటీ పోటీ చేసిన వైఎస్ షర్మిల ఘోర పరాజయం దిశగా సాగుతున్నది. అసలు ఆమెకు డిపాజిట్ కూడా దక్కడం లేదు. అన్న మీద కోపంతో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల తన గెలుపుకన్నా జగన్ పార్టీ ఓటమికి ఎక్కువగా ఉపయోగపడ్డారని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి తెలుస్తుంది.

ఇప్పటి వరకు వెల్లడయిన ఓట్ల లెక్కల ప్రకారం కడప ఎంపీగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి 1,93,621 ఓట్లతో 29,834 ఆధిక్యంలో ఉండగా, టీడీపీ అభ్యర్థి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి 1,63,787 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల కేవలం 43,061 ఓట్లకు పరిమితం అయింది. ఈ లెక్కన షర్మిలకు డిపాజిట్ దక్కే అవకాశంలేదని అర్ధం అవుతుంది.

తెలంగాణలో పాలేరు నుండి శాసనసభ్యురాలిగా పోటీ చేస్తానని షర్మిల అక్కడ ఓ ఇల్లుకు కూడా పునాది పోసింది. కానీ పార్టీ పెట్టిన తర్వాత అసలు ఎక్కడా పోటీ చేయకుండా పార్టీనే ఎత్తివేయడం విశేషం. ఇప్పుడు సొంత జిల్లా కడపలో పోటీ చేసి ఘోర పరాజయం పొందడం జీర్ణించుకోలేని అంశమే.

This post was last modified on June 4, 2024 12:23 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

19 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago