తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికలలో అసలు పోటీ చేయకుండానే పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప ఎంపీగా పోటీ పోటీ చేసిన వైఎస్ షర్మిల ఘోర పరాజయం దిశగా సాగుతున్నది. అసలు ఆమెకు డిపాజిట్ కూడా దక్కడం లేదు. అన్న మీద కోపంతో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల తన గెలుపుకన్నా జగన్ పార్టీ ఓటమికి ఎక్కువగా ఉపయోగపడ్డారని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి తెలుస్తుంది.
ఇప్పటి వరకు వెల్లడయిన ఓట్ల లెక్కల ప్రకారం కడప ఎంపీగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి 1,93,621 ఓట్లతో 29,834 ఆధిక్యంలో ఉండగా, టీడీపీ అభ్యర్థి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి 1,63,787 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల కేవలం 43,061 ఓట్లకు పరిమితం అయింది. ఈ లెక్కన షర్మిలకు డిపాజిట్ దక్కే అవకాశంలేదని అర్ధం అవుతుంది.
తెలంగాణలో పాలేరు నుండి శాసనసభ్యురాలిగా పోటీ చేస్తానని షర్మిల అక్కడ ఓ ఇల్లుకు కూడా పునాది పోసింది. కానీ పార్టీ పెట్టిన తర్వాత అసలు ఎక్కడా పోటీ చేయకుండా పార్టీనే ఎత్తివేయడం విశేషం. ఇప్పుడు సొంత జిల్లా కడపలో పోటీ చేసి ఘోర పరాజయం పొందడం జీర్ణించుకోలేని అంశమే.
This post was last modified on June 4, 2024 12:23 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…