Political News

డిపాజిట్ జారీ గల్లంతయ్యిందే !

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికలలో అసలు పోటీ చేయకుండానే పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప ఎంపీగా పోటీ పోటీ చేసిన వైఎస్ షర్మిల ఘోర పరాజయం దిశగా సాగుతున్నది. అసలు ఆమెకు డిపాజిట్ కూడా దక్కడం లేదు. అన్న మీద కోపంతో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల తన గెలుపుకన్నా జగన్ పార్టీ ఓటమికి ఎక్కువగా ఉపయోగపడ్డారని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి తెలుస్తుంది.

ఇప్పటి వరకు వెల్లడయిన ఓట్ల లెక్కల ప్రకారం కడప ఎంపీగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి 1,93,621 ఓట్లతో 29,834 ఆధిక్యంలో ఉండగా, టీడీపీ అభ్యర్థి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి 1,63,787 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల కేవలం 43,061 ఓట్లకు పరిమితం అయింది. ఈ లెక్కన షర్మిలకు డిపాజిట్ దక్కే అవకాశంలేదని అర్ధం అవుతుంది.

తెలంగాణలో పాలేరు నుండి శాసనసభ్యురాలిగా పోటీ చేస్తానని షర్మిల అక్కడ ఓ ఇల్లుకు కూడా పునాది పోసింది. కానీ పార్టీ పెట్టిన తర్వాత అసలు ఎక్కడా పోటీ చేయకుండా పార్టీనే ఎత్తివేయడం విశేషం. ఇప్పుడు సొంత జిల్లా కడపలో పోటీ చేసి ఘోర పరాజయం పొందడం జీర్ణించుకోలేని అంశమే.

This post was last modified on June 4, 2024 12:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టాక్సిక్ అయోమయం ఇంకొకరికి వరం

కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…

13 minutes ago

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

3 hours ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

4 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

4 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

5 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

8 hours ago