దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి చూపు.. ఫోకస్ మొత్తం ఏపీ మీదనే ఉంది. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? గెలిచిన పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని? జనసేన ప్రభావం ఎంతమేర ఉంటుంది? లాంటి ప్రశ్నలే ఉన్నాయి.
తెలుగుప్రజల ఆసక్తికి తగ్గట్లే.. ఎగ్జిట్ పోల్స్ సైతం తమ భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేయటంతో ఒకలాంటి కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో.. ఓటరు నాడి ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరెన్ని అంచనాలు వేసుకున్న.. చివరకు ఈవీఎంలు ఓపెన్ చేస్తే మాత్రమే ఫలితం అర్థమవుతుంది. ఈ విషయం ఈ రోజు ఓట్ల లెక్కింపు షురూ అయినంతనే అర్థమైంది.
ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.. జనసేన కంటే తక్కువ స్థానాల్లో వైసీపీ అధిక్యతలో ఉండటం. ఇవే ఫైనల్ ఫలితాలు అని చెప్పట్లేదు. ఇప్పటికైతే.. అంటే ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో.. కౌంటింగ్ మొదలైన మొదటి గంటన్నరలో కనిపిస్తున్న సీన్ చూస్తే మాత్రం ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితి వైసీపీకి ఎదురవుతుందని అంచనా వేయలేదనే చెప్పాలి.
మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 56 స్థానాల్లో అధిక్యతలో నిలిస్తే.. అధికార వైసీపీ 9 స్థానాల్లో అధిక్యతలో ఉంది. జనసేన సైతం 9 స్థానాల్లో అధిక్యతలో ఉంది. బీజేపీ మూడు స్థానాల్లో అధిక్యతలో ఉంది. 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ 9 స్థానాల్లో అధిక్యతలో ఉంటే.. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన మాత్రం 9స్థానాల్లో అధిక్యతలో నిలవటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇదేమీ ఫైనల్ లెక్క కాదు. కాకుంటే.. కౌంటింగ్ మొదలైన మొదటి గంటర్న వేళకు.. ఇలాంటి సీన్ ను మాత్రం ఎవరూ ఊహించలేదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ 11 స్థానాల్లో ముందంజలో ఉంటే.. అధికార వైసీపీ 2 స్థానాల్లో నిలిచింది. ఏపీలో ఏ మాత్రం బలం లేదని చెప్పే బీజేపీ ఏకంగా నాలుగు స్థానాల్లో అధిక్యతలో నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఏపీ అధికార పక్షం ఈ ఎన్నికల్లో తాను ఊహించని పరిస్థితుల్ని ఎదుర్కొనేలా ఫలితాలు వెల్లడవుతాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on June 4, 2024 9:43 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…