Political News

టిడిపి లాయర్లే జడ్జీలయ్యారా ? వైసిపి ఎంపి సంచలనం

తెలుగుదేశంపార్టీకి లాయర్లుగా పనిచేసిన వాళ్ళే తర్వాత జడ్జీలయ్యారంటూ వైసిపి ఎంపి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మిథున్ పై ఆరోపణలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టిడిపికి సన్నిహితంగా ఉన్న లాయర్లే తర్వాత జడ్జీలైనపుడు న్యాయవ్యవస్ధ నుండి నిష్పాక్షిక తీర్పులను ఎలా ఆశించగలమంటూ మిథున్ వేసిన ప్రశ్న సంచలనంగా మారింది. చట్టసభల అధికారాలను ఏపిలో హై కోర్టులు తీసేసుకుంటున్నాయంటూ ఎంపి మండిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను చూసిన తర్వాత కేంద్రంమే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటూ కోరారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబి విచారణకు ప్రభుత్వం నిర్ణయించగానే కోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ఎంపి గుర్తుచేశారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్ధను పునఃపరిశీలించాలంటూ ఎంపి చేసిన విజ్ఞప్తిపై టిడిపి ఎంపిలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పైనే కాకుండా ఫైబర్ గ్రిడ్ లో జరిగిన రూ. 2 వేల కోట్ల అవినీతిపైన కూడా సిబిఐతో విచారణ చేయించాలన్న తమ ప్రభుత్వం నిర్ణయానికి కేంద్రం కూడా మద్దతుగా నిలవాలన్నారు.

తమ డిమాండ్ కు మద్దతుగా రాష్ట్రంలో బిజెపి నేతలు కూడా మద్దతుగా నిలిచిన విషయాన్ని మిథున్ గుర్తుచేశారు. ఎంపి మాట్లాడుతున్నంత సేపు టిడిపి ఎంపిలు సభలో గోల చేస్తునే ఉండటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే మిథున్ చేసిన ఆరోపణలు న్యాయవ్యవస్ధపేనే కాబట్టి టిడిపి ఎంపిలు ఇంతగా గోల చేయాల్సిన అవసరం లేదు. అయినా ఎంపి మాటలకు అంతరాయం కలిగిస్తునే ఉన్నారంటే, ఉలిక్కిపడ్డారంటే ఎక్కడో తేడా ఉన్నట్లే అనుమానించాల్సుంటుంది.

మొత్తానికి న్యాయవ్యవస్ధపై వైసిపి నుండి వరుసగా రెండోరోజు కూడా ఆరోపణలు మొదలయ్యాయి. రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా హైకోర్టులో కొందరు జడ్జీల పనితీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు పనితీరు వల్ల రాష్ట్రప్రభుత్వం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఎంపి మండిపోయారు. హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై విజయసాయి దాదాపు పదినిముషాలు ధ్వజమెత్తారు. సరే చివరకు ఆయన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుండి తొలగించారు లేండి. రెండోరోజు మిథున్ కూడా విజయసాయినే అనుసరించారు. మొత్తానికి హైకోర్టుకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో వైసీపీ తిరుగుబాటు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

This post was last modified on September 19, 2020 7:32 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

43 seconds ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago