Political News

జ‌గ‌న్ ప్ర‌మాదంలో ఉన్నారు

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌మాదంలో ఉన్నారు. ఆయ‌న‌ను కాపాడుకోవాల్సిన  బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. అస‌లు ఎవ‌రిని న‌మ్మాలో న‌మ్మ‌కూడదో కూడా అర్ధం కావ‌డం లేదు. ఈ స‌మ‌యంలో మ‌న‌మే జ‌గ‌న్‌ను కాపాడుకోవాలి.. అని ఏపీ ప్ర‌భుత్వ అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌(ఏఏజీ)  పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న బ్రిట‌న్‌లో పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఎన్నారై వైసీపీ నాయ‌కుల‌తో ఓ హోట‌ల్‌లో భేటీ అయ్యారు. ఏపీలో జ‌రిగిన పోలింగ్‌, దీనికి ముందు జ‌రిగిన ప్ర‌చారం వంటి అంశాల‌పై ఆయ‌న చ‌ర్చించారు.

వైసీపీకి ఎన్నారైల నుంచి అందిన స‌హ‌కారం అద్భుతంగా ఉంద‌ని కొనియాడారు. ఇదేస‌హ‌కారం ముందు ముందు కూడా అందించాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ చాలా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు. అంద‌రూ జ‌గ‌న్‌ను అనుమానిస్తున్నార‌ని.. అవ‌మానిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో అంద‌రూ ఏకమై.. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌న్నారు. అయితే.. ఈ సంద‌ర్భంగా పొన్న‌వోలు ఒక్క‌సారిగా కంట‌త‌డి పెట్ట‌డం గ‌మ‌నార్హం. చాలా సేపు ఆయ‌న మౌనంగా ఉండిపోయారు. అయితే.. ఎన్నారై నాయ‌కులు జోక్యం చేసుకుని ఆయ‌న‌ను ఓదార్చారు.

కాగా.. పొన్నువోలు వ్య‌వ‌హారం.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో.. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును చార్జిషీటులో పొన్న‌వోలు చేర్పించార‌ని.. జ‌గ‌న్ సూచ‌న‌లు స‌ల‌హాల‌తోనే ఆయ‌న కోర్టుకు వెళ్లి పోరాడి మ‌రీ.. వైఎస్ పేరును చార్జిషీటులో చేర్చార‌ని.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పేర్కొన్నారు. అయితే.. దీనికి పొన్న‌వోలు కూడా.. కౌంట‌ర్ ఇచ్చారు. త‌ను అలా చేయ‌లేద‌ని.. కాంగ్రెస్ పార్టీనే చార్జిషీట్‌లో వైఎస్ పేరును చేర్చింద‌ని ఎదురు దాడి చేసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on May 27, 2024 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన…

2 hours ago

సాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది!

యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…

3 hours ago

మన త్రిష సత్తా చాటితే వరల్డ్ కప్ మనదే

అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…

3 hours ago

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో…

4 hours ago

మీ కోసం కాల్ చేసే గూగుల్.. ‘ఆస్క్ ఫర్ మీ’ AI ప్రయోగం!

రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…

4 hours ago

కాలు క‌ద‌ప‌రు.. వాయిస్ పెంచ‌రు.. ఇదేం రాజ‌కీయం.. !

ఒక‌వైపు వైసీపీ నుంచి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు. ప్ర‌భుత్వం ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం లేద‌ని.. ఇక‌, చేయ‌ద‌ని .. చంద్ర‌బాబు పేద‌ల‌కు…

5 hours ago