ఏపీ సీఎం జగన్ ప్రమాదంలో ఉన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్ధం కావడం లేదు. ఈ సమయంలో మనమే జగన్ను కాపాడుకోవాలి.. అని ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన బ్రిటన్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్నారై వైసీపీ నాయకులతో ఓ హోటల్లో భేటీ అయ్యారు. ఏపీలో జరిగిన పోలింగ్, దీనికి ముందు జరిగిన ప్రచారం వంటి అంశాలపై ఆయన చర్చించారు.
వైసీపీకి ఎన్నారైల నుంచి అందిన సహకారం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇదేసహకారం ముందు ముందు కూడా అందించాలని సూచించారు. ప్రస్తుతం సీఎం జగన్ చాలా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందరూ జగన్ను అనుమానిస్తున్నారని.. అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ ఏకమై.. జగన్కు మద్దతుగా నిలవాలన్నారు. అయితే.. ఈ సందర్భంగా పొన్నవోలు ఒక్కసారిగా కంటతడి పెట్టడం గమనార్హం. చాలా సేపు ఆయన మౌనంగా ఉండిపోయారు. అయితే.. ఎన్నారై నాయకులు జోక్యం చేసుకుని ఆయనను ఓదార్చారు.
కాగా.. పొన్నువోలు వ్యవహారం.. ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల్లో.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చార్జిషీటులో పొన్నవోలు చేర్పించారని.. జగన్ సూచనలు సలహాలతోనే ఆయన కోర్టుకు వెళ్లి పోరాడి మరీ.. వైఎస్ పేరును చార్జిషీటులో చేర్చారని.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అయితే.. దీనికి పొన్నవోలు కూడా.. కౌంటర్ ఇచ్చారు. తను అలా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీనే చార్జిషీట్లో వైఎస్ పేరును చేర్చిందని ఎదురు దాడి చేసిన విషయం తెలిసిందే.
This post was last modified on May 27, 2024 9:32 pm
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…