Political News

కూట‌మి విజ‌యం కోరుకుంటున్న వైసీపీ అభ్య‌ర్థులు?

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ, కూట‌మి మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డిచింది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అభ్య‌ర్థుల‌పై సీఎం జ‌గ‌న్‌తో స‌హా వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎంత‌మంది జ‌త‌క‌ట్టినా వైసీపీ గెలుపును ఆప‌లేర‌ని అన్నారు. కానీ ఇప్పుడు అంతా త‌ల‌కిందులైంద‌నే చెప్పాలి. జూన్ 4న వెలువ‌డే ఫ‌లితాల్లో కూట‌మి గెల‌వాల‌ని వైసీపీ అభ్య‌ర్థులు కోరుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకు ఓ కార‌ణం ఉంది.

ఎన్నిక‌ల్లో ఉన్న‌దంతా పెట్టి వైసీపీ అభ్య‌ర్థులు పోటీ చేశారు. జ‌గ‌న్ అభ‌యంతో గెలుస్తామ‌నే ధీమా వ్య‌క్తం చేశారు. కానీ పోలింగ్ స‌ర‌ళిని విశ్లేషించుకుంటున్న ఆయా అభ్య‌ర్థులు ముందే ఓట‌మిపై అంచ‌నాకు వ‌స్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్క‌ద‌నే నిజాన్ని అర్థం చేసుకుంటున్నార‌ని తెలిసింది. దీంతో ఎన్నిక‌ల్లో పెట్టిన డ‌బ్బుల్లో కాస్త‌యినా వెన‌క్కి తెచ్చుకునేందుకు ఆయా అభ్య‌ర్థులు ఫ‌లితాల‌పై బెట్టింగ్ వేస్తున్నార‌ని స‌మాచారం. తాము ఎలాగో ఓడిపోతామ‌ని తెలిసి కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యాలు సాధిస్తార‌ని ఈ వైసీపీ నేత‌లు బెట్టింగ్ వేస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించినా వైసీపీ నేత‌ల‌కు ఇప్పుడు సీన్ అర్థ‌మైపోయింద‌నే టాక్ ఉంది. రోజులు గ‌డిచే కొద్దీ వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన నాయ‌కుల్లో మార్పు క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఓ వైపు బెట్టింగ్ రాయుళ్లు కూట‌మిదే అధికార‌మ‌ని ల‌క్ష‌ల్లో పందేలు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొంత‌మంది వైసీపీ అభ్య‌ర్థులు కూడా కూట‌మిదే గెలుపంటూ బెట్టింగ్ కాస్తున్నారు. ఓ వైసీపీ అభ్య‌ర్థి ఏకంగా రూ.50 కోట్ల వ‌ర‌కూ పందెం కాసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎలాగో తాము ఓడిపోతాం కాబ‌ట్టి కూట‌మి గెలుపుతోనైనా పందెంలో కాసిన డ‌బ్బులు వ‌స్తాయ‌నే ఆశ‌తో వైసీపీ అభ్య‌ర్థులు ఉన్న‌ట్లు తెలిసింది.

This post was last modified on May 23, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

30 minutes ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

57 minutes ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

1 hour ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

1 hour ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

5 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

10 hours ago