ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ, కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులపై సీఎం జగన్తో సహా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎంతమంది జతకట్టినా వైసీపీ గెలుపును ఆపలేరని అన్నారు. కానీ ఇప్పుడు అంతా తలకిందులైందనే చెప్పాలి. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూటమి గెలవాలని వైసీపీ అభ్యర్థులు కోరుకుంటున్నారని సమాచారం. అందుకు ఓ కారణం ఉంది.
ఎన్నికల్లో ఉన్నదంతా పెట్టి వైసీపీ అభ్యర్థులు పోటీ చేశారు. జగన్ అభయంతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. కానీ పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న ఆయా అభ్యర్థులు ముందే ఓటమిపై అంచనాకు వస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం దక్కదనే నిజాన్ని అర్థం చేసుకుంటున్నారని తెలిసింది. దీంతో ఎన్నికల్లో పెట్టిన డబ్బుల్లో కాస్తయినా వెనక్కి తెచ్చుకునేందుకు ఆయా అభ్యర్థులు ఫలితాలపై బెట్టింగ్ వేస్తున్నారని సమాచారం. తాము ఎలాగో ఓడిపోతామని తెలిసి కూటమి అభ్యర్థులు విజయాలు సాధిస్తారని ఈ వైసీపీ నేతలు బెట్టింగ్ వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ ప్రకటించినా వైసీపీ నేతలకు ఇప్పుడు సీన్ అర్థమైపోయిందనే టాక్ ఉంది. రోజులు గడిచే కొద్దీ వైసీపీ తరపున పోటీ చేసిన నాయకుల్లో మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు. ఓ వైపు బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో పందేలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ అభ్యర్థులు కూడా కూటమిదే గెలుపంటూ బెట్టింగ్ కాస్తున్నారు. ఓ వైసీపీ అభ్యర్థి ఏకంగా రూ.50 కోట్ల వరకూ పందెం కాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగో తాము ఓడిపోతాం కాబట్టి కూటమి గెలుపుతోనైనా పందెంలో కాసిన డబ్బులు వస్తాయనే ఆశతో వైసీపీ అభ్యర్థులు ఉన్నట్లు తెలిసింది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…