Political News

కూట‌మి విజ‌యం కోరుకుంటున్న వైసీపీ అభ్య‌ర్థులు?

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ, కూట‌మి మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డిచింది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అభ్య‌ర్థుల‌పై సీఎం జ‌గ‌న్‌తో స‌హా వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎంత‌మంది జ‌త‌క‌ట్టినా వైసీపీ గెలుపును ఆప‌లేర‌ని అన్నారు. కానీ ఇప్పుడు అంతా త‌ల‌కిందులైంద‌నే చెప్పాలి. జూన్ 4న వెలువ‌డే ఫ‌లితాల్లో కూట‌మి గెల‌వాల‌ని వైసీపీ అభ్య‌ర్థులు కోరుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకు ఓ కార‌ణం ఉంది.

ఎన్నిక‌ల్లో ఉన్న‌దంతా పెట్టి వైసీపీ అభ్య‌ర్థులు పోటీ చేశారు. జ‌గ‌న్ అభ‌యంతో గెలుస్తామ‌నే ధీమా వ్య‌క్తం చేశారు. కానీ పోలింగ్ స‌ర‌ళిని విశ్లేషించుకుంటున్న ఆయా అభ్య‌ర్థులు ముందే ఓట‌మిపై అంచ‌నాకు వ‌స్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్క‌ద‌నే నిజాన్ని అర్థం చేసుకుంటున్నార‌ని తెలిసింది. దీంతో ఎన్నిక‌ల్లో పెట్టిన డ‌బ్బుల్లో కాస్త‌యినా వెన‌క్కి తెచ్చుకునేందుకు ఆయా అభ్య‌ర్థులు ఫ‌లితాల‌పై బెట్టింగ్ వేస్తున్నార‌ని స‌మాచారం. తాము ఎలాగో ఓడిపోతామ‌ని తెలిసి కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యాలు సాధిస్తార‌ని ఈ వైసీపీ నేత‌లు బెట్టింగ్ వేస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించినా వైసీపీ నేత‌ల‌కు ఇప్పుడు సీన్ అర్థ‌మైపోయింద‌నే టాక్ ఉంది. రోజులు గ‌డిచే కొద్దీ వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన నాయ‌కుల్లో మార్పు క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఓ వైపు బెట్టింగ్ రాయుళ్లు కూట‌మిదే అధికార‌మ‌ని ల‌క్ష‌ల్లో పందేలు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొంత‌మంది వైసీపీ అభ్య‌ర్థులు కూడా కూట‌మిదే గెలుపంటూ బెట్టింగ్ కాస్తున్నారు. ఓ వైసీపీ అభ్య‌ర్థి ఏకంగా రూ.50 కోట్ల వ‌ర‌కూ పందెం కాసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎలాగో తాము ఓడిపోతాం కాబ‌ట్టి కూట‌మి గెలుపుతోనైనా పందెంలో కాసిన డ‌బ్బులు వ‌స్తాయ‌నే ఆశ‌తో వైసీపీ అభ్య‌ర్థులు ఉన్న‌ట్లు తెలిసింది.

This post was last modified on May 23, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

1 hour ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

2 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

3 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

3 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

3 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

4 hours ago