ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస.. అనంతర పరిణామాలపై ఏకంగా 100మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా 300 మందిపై ఎఫ్ ఐఆర్లు నమోదు చేశారు.ఇంకా, వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా వుంటే..ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. వీటిని విచారించేందు కు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా నియమించారు.
పోలీసు డైరెక్టర్ జనరల్.. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ విచరణలకు సంబంధించిన ప్రాథమిక అంశాలతో ఒక నివేదికను సిద్ధం చేశాయి. పల్నాడులోని మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఈ బృందాలు పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వివరాలు సేకరించాయి.
మరోవైపు.. సస్పెండ్ అయిన.. ఎస్పీలు, సీఐల నుంచి కూడా వివరణ తీసుకుంటున్నారు. ఇప్పటికే వంద మందిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయా వివరాలను కూడా పరిశీలించి ప్రాథమిక నివేదికను రూపొందించాయి. ఈ నివేదికను సిట్ బృందాలు డీజీ వినీత్ బ్రిజ్ లాల్ కు అందించనున్నారు. అనంతరం ఆయా నివేదికలను వినీత్ బ్రిజ్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. అదే సమయంలో అల్లర్లపై విచరణకు మరింత సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు.
అయితే.. ఇది మరో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. వైసీపీ అనుకూల అధికారులనే సిట్లో నియమిం చారని.. దీంతో సిట్ నివేదికలు కూడా ఏకపక్షంగా ఉండే అవకాశం ఉందని టీడీపీ నాయకులువిమర్శలు గుప్పిస్తున్నారు. ‘పెద్దతలకాయలపై’ చర్యలు తీసుకోకుండా.. కేవలం నివేదికలతో సరిపెడుతున్నారని అంటున్నారు. అసలు నియామకాలే తప్పుగా జరిగాయని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…