Political News

పోలింగ్ ఎఫెక్ట్‌: 100 మంది అరెస్టు.. 300 మందిపై ఎఫ్ ఐఆర్‌లు

ఏపీలో ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస‌.. అనంతర ప‌రిణామాల‌పై ఏకంగా 100మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా 300 మందిపై ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేశారు.ఇంకా, వీరి సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే..ఈ ఘ‌ట‌న‌ల‌పై ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. వీటిని విచారించేందు కు యుద్ధ ప్రాతిప‌దిక‌న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాల‌ను కూడా నియ‌మించారు.

పోలీసు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌.. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది అధికారుల‌తో మూడు బృందాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ విచరణలకు సంబంధించిన ప్రాథమిక అంశాలతో ఒక నివేదికను సిద్ధం చేశాయి. పల్నాడులోని మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఈ బృందాలు పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వివరాలు సేకరించాయి.

మ‌రోవైపు.. స‌స్పెండ్ అయిన‌.. ఎస్పీలు, సీఐల నుంచి కూడా వివ‌ర‌ణ తీసుకుంటున్నారు. ఇప్పటికే వంద మందిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయా వివరాలను కూడా పరిశీలించి ప్రాథమిక నివేదికను రూపొందించాయి. ఈ నివేదికను సిట్ బృందాలు డీజీ వినీత్ బ్రిజ్ లాల్ కు అందించనున్నారు. అనంతరం ఆయా నివేదికలను వినీత్ బ్రిజ్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. అదే సమయంలో అల్లర్లపై విచరణకు మరింత సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు.

అయితే.. ఇది మ‌రో రాజ‌కీయ వివాదానికి దారితీస్తోంది. వైసీపీ అనుకూల అధికారుల‌నే సిట్‌లో నియ‌మిం చార‌ని.. దీంతో సిట్ నివేదిక‌లు కూడా ఏక‌ప‌క్షంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ నాయ‌కులువిమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ‘పెద్ద‌తల‌కాయ‌ల‌పై’ చ‌ర్య‌లు తీసుకోకుండా.. కేవ‌లం నివేదిక‌ల‌తో స‌రిపెడుతున్నార‌ని అంటున్నారు. అస‌లు నియామ‌కాలే త‌ప్పుగా జ‌రిగాయ‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 20, 2024 3:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

10 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

10 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

10 hours ago