విశ్వంభర షూటింగ్ తప్ప వేరే ప్రపంచం లేకుండా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. గత ఏడాది కూతురు సుష్మితని ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మార్చే క్రమంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఓకే చేసి, ఆ తర్వాత భోళా శంకర్ ఫలితం చూసి వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. అదే కథను రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కొన్ని కీలక మార్పులు చేసి త్రినాథరావు నక్కినకు ఇస్తే ఆయన దాన్ని చక్కగా సందీప్ కిషన్ తో సెట్ చేసుకున్నాడు. చిరు దగ్గరకు రెగ్యులర్ గా డైరెక్టర్లు వస్తున్నారు, లైన్లు వినిపించి వెళ్లిపోతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. పవన్ కళ్యాణ్ బ్రో చేశాక అన్నయ్య సినిమా ఒకటి చేయాలనేది టిజి విశ్వప్రసాద్ టార్గెట్. ఈ కారణంగానే అమెరికాలో చిరు సన్మాన సభ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారనే టాక్ ఉంది. తమ బ్యానర్ లోనే మిస్టర్ బచ్చన్ చేస్తున్న హరీష్ శంకర్ తో ఓ స్టోరీ చెప్పించారు. కానీ అది ఫైనల్ కాలేదట. గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజా కూడా లైన్ లోనే ఉన్నాడట. కానీ అతను తమిళంలో తమ్ముడు జయం రవితో తని ఒరువన్ 2 (ధృవ సీక్వెల్)లో బిజీగా ఉన్నాడు. పూర్తయ్యేలోపు ఏడాది గడిచేలా ఉంది.
సో ఇప్పటికిప్పుడు చిరు ఎవరితో చేయబోయేది వెంటనే చెప్పలేం. పీపుల్స్ మీడియాకి ఓకే చెప్పినా ఆ ప్రాజెక్టులో సుష్మిత భాగస్వామిగా ఉంటుందట. మొత్తం ఫైనల్ కావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. హరీష్ శంకర్, మోహన్ రాజాలలో ఎవరికి ఎస్ చెప్పినా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కన్నా ముందు షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆరు నెలలు కేటాయించబోతున్న నేపథ్యంలో ఇండిపెండెన్స్ డేకన్నా ముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో వశిష్ట పని చేస్తున్నాడు. ఆరు నూరైనా జనవరి 10 విడుదలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని యువి వర్గాలు అంటున్నాయి.
This post was last modified on May 20, 2024 6:54 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…