కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన విషయంగానే మెజారటీ మనుషులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయిలో .. ఉన్నతంగా భావించిన వారు.. ఒకింత జాగ్రత్తగానే నోరు వాడతారు. రాజకీయాల్లో ఉంటే.. ఆ లెక్క వేరు. ఈ రోజుతిట్టుకుని.. రేపు కలుసుకుంటారు. అయితే..ఇక్కడ కూడా కొందరు కీలక నాయకులు ఉంటారు. వారు మాత్రం ఆచి తూచి మాట్లాడతారు. ఒక్క మాట మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచిం చుకుంటారు.
ఇలాంటి వారిలో ముద్రగడ పద్మనాభం ఒకరు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన నాలుగుదశాబ్దాలకు పైగానే అజాత శత్రువుగానే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల కూడా ఈయన ఇంటికి వచ్చిన సందర్భాలు, కలిసి భోం చేసినసందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నాయకుడు ఇప్పుడు అంతర్మథనంలో పడిపోయారని పిఠాపురంలో టాక్నడుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. “పవన్ కల్యాణ్ను ఓడిస్తా… ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా” అని శపథం చేసిన విషయం తెలిసిందే.
అంతేకాదు.. ‘పద్మనాభ రెడ్డి’గా మార్చుకుంటానని కూడా ముద్రగడ అన్నారు. ఈయన ఆవేశంతో అన్నా రో.. ఆగ్రహంతో అన్నారో.. లేక వైసీపీ పిఠాపురంలో గెలుస్తుందని నమ్మారో మొత్తానికి అయితే అనేశారు. పవన్ ఓడిస్తానని చెప్పారు. కట్ చేస్తే.. ఎన్నికల రోజు నుంచి ఇప్పటి వరకు పిఠాపురంపై ఒక్కటంటే ఒక్క సర్వే కానీ.. విశ్లేషణ కానీ..యాంటీగా రాలేదు. ముఖ్యంగా పవన్కు నెగిటివ్గా కూడా.. ఎవరూ విశ్లేషించ లేదు. కరడు గట్టిన వైసీపీ అభిమానులు కూడా పవన్ ఓడిపోతారని చెప్పలేదు.
కేవలం టఫ్ ఫైట్ ఉంటుందని మాత్రమే అందరూ చెబుతున్నారు. దీనికితోడు.. ఓటింగ్ శాతం కూడా.. భారీగా పుంజుకుంది. 86.63 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఊహించని పరిణామం కావడంతో అందరూ.. లెక్కలు సరిచూసుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో 70 వేలకు పైబడి ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లతోపాటు ఎస్సీ, బీసీలు అంతా పవన్ కల్యాణ్కు ఓటువేశారని, ఈ సారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ గెలవబోతున్నారని పెద్ద ఎత్తున పందేలు కూడా కడుతున్నారు.
దీంతో ముద్రగడ అంతర్మథనంలో పడిపోయారని తెలుస్తోంది. అనవసరంగా నోరు జారానా? అని ఆయన చింతిస్తున్నారని.. పిఠాపురం టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ముద్రగడ అంత ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. వైసీపీ నుంచి ఆయనకు మద్దతు లభించలేదు. ఇక, ఆయ న కుమార్తె ఎదురు దాడి చేసినప్పుడు కూడా.. వైసీపీఅగ్రనేతల నుంచి ఎలాంటి సానుభూతి కనిపించలేదు. ఈ పరిణామాలు కూడా ముద్రగడను ఇప్పుడు మానసికంగా వేధిస్తున్నాయని అంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 20, 2024 3:39 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…