Political News

‘మండి’లో ‘కంగు’మంటుందా ? ‘కంగు’తింటుందా ?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని ఆయా లోక్ సభ నియోజకవర్గాలలో పోటీని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ తరపున ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుండి హిమాచల్ కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నాడు.

గత రెండు లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ రాజకుటుంబీలకు పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆ లెక్కన ఈ సారి విజయం విక్రమాదిత్యదే అంటున్నారు. అయితే తొలిసారి బీజేపీ ఈ స్థానం నుండి మహిళను పోటీకి దింపిన నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా ? అని భావిస్తున్నారు.

బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కులు మహేశ్వర్ సింగ్, మాజీ కేంద్రమంత్రి సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ కంగనాకు మద్దతుగా నిలబడడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నికల కోసం కంగనా నెల రోజుల పాటు రాజకీయాలు చేసేందుకు వచ్చిందని, ఎన్నికలు అయిపోగానే సూట్ కేసు సర్దుకుని బాలీవుడ్ కు వెళ్లిపోతుందని విక్రమాదిత్య తీవ్ర విమర్శలు చేస్తున్నాడు.

విక్రమాదిత్య విమర్శలకు ధీటుగా కంగనా స్పందిస్తుంది. చోటా పప్పు అని విమర్శిస్తూ “2023 లో పెద్ద ఎత్తున వరదలు వస్తే, హిమాచల్ ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, మండి యూనివర్శిటీ, 250 కోట్ల శివధన్ ప్రాజెక్టులను నిలిపేస్తే” ఏం చేశావని ప్రశ్నించింది. అయితే ఢిల్లీ సరిహద్దులలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడినప్పుడు కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెకు ప్రతికూలంగా మారాయి. రైతు సంఘాలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండిలో కంగనా ‘కంగు’మంటుందా ? ‘ఖంగు’తింటుందా ? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

This post was last modified on May 19, 2024 3:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

6 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

7 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

8 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

10 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

11 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

11 hours ago