ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు ఈ నెల 14న సీబీఐ కోర్టు అనుమతించింది. నిన్న లండన్ బయలుదేరిన జగన్ తిరిగి జూన్ 1న రాష్ట్రానికి తిరిగి వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే విలాసవంతమైన విమానంలో ఆయన పర్యటనకు వెళ్లారు. దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలుగా చెబుతున్నారు. ఒకరోజు ముందుగానే గన్నవరం విమానాశ్రయానికి ఆ విమానం చేరుకున్నది.
శుక్రవారం రాత్రి తన కుటుంబంతో రాత్రి 11 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా లండన్ బయలుదేరారు. జగన్ భద్రత కోసం ఇప్పటికే నలుగురు అధికారులు లండన్ వెళ్లినట్లు సమాచారం. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి రూ.కోటిన్నర అవుతున్నట్లు తెలుస్తుంది. జగన్ వ్యక్తిగత పర్యటన కావడంతో విమాన ఖర్చులు, కుటుంబ ఖర్చులు ఆయన సొంతంగా భరించినా భద్రతా సిబ్బంది ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనున్నదని తెలుస్తుంది.
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…