Political News

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు ఈ నెల 14న సీబీఐ కోర్టు అనుమతించింది. నిన్న లండన్ బయలుదేరిన జగన్ తిరిగి జూన్ 1న రాష్ట్రానికి తిరిగి వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. విస్టా జెట్‌ కంపెనీకి చెందిన బొంబార్డియర్‌ 7500 అనే విలాసవంతమైన విమానంలో ఆయన పర్యటనకు వెళ్లారు. దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలుగా చెబుతున్నారు. ఒకరోజు ముందుగానే గన్నవరం విమానాశ్రయానికి ఆ విమానం చేరుకున్నది.

శుక్రవారం రాత్రి తన కుటుంబంతో రాత్రి 11 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా లండన్ బయలుదేరారు. జగన్ భద్రత కోసం ఇప్పటికే నలుగురు అధికారులు లండన్ వెళ్లినట్లు సమాచారం. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి రూ.కోటిన్నర అవుతున్నట్లు తెలుస్తుంది. జగన్ వ్యక్తిగత పర్యటన కావడంతో విమాన ఖర్చులు, కుటుంబ ఖర్చులు ఆయన సొంతంగా భరించినా భద్రతా సిబ్బంది ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనున్నదని తెలుస్తుంది.

This post was last modified on May 18, 2024 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

29 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

49 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago