సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయమూ వార్తే. సోషల్ మీడియాలో ఒక ప్రముఖుడు ఇంకో ప్రముఖుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం.. అవతలి నుంచి బదులు రావడం.. రాకపోవడం.. ఇవి కూడా చర్చనీయాంశాలే అయిపోతున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రాజకీయ, సినీ, వ్యాపార వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. కొంత కాలంగా బీజేపీతో కలిసి సాగుతూ, ఆ పార్టీని బాగా ఓన్ చేసుకుని మోడీని మెప్పించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్న పవన్.. ప్రధానిని పొగుడుతూ ఉదయమే ట్విట్టర్లో జన్మదిన శుభాకంక్షలు చెప్పాడు.
ఐతే సాయంత్రం మోడీ తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు ఒక్కొక్కరికి ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఐతే టాలీవుడ్ నుంచి పవన్ అన్నయ్య చిరంజీవితో పాటు మహేష్ బాబు, అక్కినేని నాగార్జునలకు మోడీ చాలా ముందుగానే బదులిచ్చాడు. వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం జవాబు రాలేదు. ఆ తర్వాత వివిధ రంగాలకు చెందిన వేరే వ్యక్తులు ఒక్కొక్కరికి శుభాకాంక్షలు చెబుతూ వెళ్లాడు. పవన్తో పాటు చంద్రబాబుకు కూడా ఆయన జవాబివ్వలేదు. దీంతో వీళ్లిద్దరి ఉద్దేశపూర్వకంగా విస్మరించాడన్న ప్రచారం జరిగింది.
చంద్రబాబుతో అయితే స్నేహం తెగిపోయిది.. కానీ మిత్ర పక్షానికి చెందిన పవన్ను ఎందుకు ఇగ్నోర్ చేశాడో జనాలకు అర్థం కాలేదు. కొందరు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పవన్ అభిమానులను ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టారు. కొన్ని వెబ్ సైట్లలోనూ దీనిపై వార్తలు మొదలయ్యాయి. పొరబాటున మరిచిపోతే మరిచిపోయి ఉండొచ్చు.
లేదా కొంచెం ఆలస్యం అయ్యుండొచ్చు. కానీ ఈలోపు ఇదొక చర్చనీయాంశంగా మారింది. పవన్కు జవాబివ్వకుండానే మోడీ నిష్క్రమిస్తే వ్యతిరేక వర్గాల దాడిని తట్టుకోవడం కష్టమని పవన్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ కొన్ని గంటల తర్వాత మోడీ.. పవన్కు బదులిచ్చి వాళ్ల టెన్షన్ తీర్చేశాడు. పనిలో పనిగా చంద్రబాబుకు కూడా మోడీ కృతజ్ఞతలు చెప్పడం విశేషం.
This post was last modified on September 18, 2020 1:15 pm
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…