Political News

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఇవి సవాల్ అనే చెప్పాలి. మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాలలో గెలుపు కొత్త ఎమ్మెల్యేలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామర్ధ్యానికి పరీక్ష. ఇక భువనగిరి లోక్ సభ గెలుపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సవాల్ గా మారింది.

భువనగిరిలో బీజేపీ నుండి బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ నుండి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి క్యామ మల్లేష్ లు పోటీ చేశారు. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయిన బూర నర్సయ్యగౌడ్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డాడు. ఒకసారి ఎంపీ, మరోసారి ఓటమి నేపథ్యంలో మూడో సారి మూడు నెలల ముందు నుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాడు. మోడీ ఛరీష్మా, బీసీ కార్డు కలిసి వస్తుందని భావిస్తున్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ ఓటు బ్యాంకు, కేసీఆర్ ఛరీష్మా, కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకతను నమ్ముకున్నాడు.

ఇక చివరి నిమిషం వరకు తమ కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ కావాలని కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నాలు చేసినా రేవంత్ తన సన్నిహితుడు చామలకు టికెట్ దక్కించుకున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటి వద్దనే పార్లమెంట్ సమీక్ష నిర్వహించి అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని స్పష్టం చేశాడు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిని కాస్త ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాడు. రేవంత్ తో పాటు ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలు కూడా వచ్చారు.

ఈ నేపథ్యంలో భువనగిరి ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది చర్చానీయాంశంగా మారింది. గత శాసనసభ ఎన్నికలలో ఏడు నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఇక్కడ కేవలం 75 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలలో ఎలా విజయం సాధించగలుగుతుంది అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ట్రయాంగిల్ పోటీలో స్వల్ప తేడాతో తమకు విజయం ఖాయం అని బీఆర్ఎస్ వాధిస్తున్నది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో వారికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కోమటిరెడ్డి సోదరులు గట్టిగా పనిచేసినందువల్లే కాంగ్రెస్ ప్రభావం కనిపించిందని, లేకపోతే ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయేవారం అన్నది వారి అనుచరుల వాదన. భువనగిరి ఎంపీ స్థానం గెలిస్తే కోమటిరెడ్డి సోదరుల క్రెడిట్ లోకి, ఓడిపోతే అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోకి నెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది.

This post was last modified on May 17, 2024 10:34 am

Share
Show comments

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago