సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం. దీని మీద గతంలో ఎన్నో చర్చలు జరిపి స్వయం నిబంధనలు పాటించాలని టాలీవుడ్ పెద్దలు ప్రయత్నించినా అవేవి ఫలితం ఇవ్వడం లేదు. ఇప్పుడీ టాపిక్ కి కారణం కృష్ణమ్మ. నిన్న రాత్రి నుంచి చెప్పాపెట్టకుండా హఠాత్తుగా ఊడిపడిన పిడుగులా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం చూసి జనాలు షాక్ తిన్నారు. ఎందుకంటే రెండో వారంలో అడుగుపెట్టే ముందు రోజు ఇంత త్వరగా చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్న సినిమా డిజిటల్ లో రావడం ఈ మధ్య కాలంలో జరగలేదు.
దీని గురించి సర్వత్రా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణమ్మ బాక్సాఫీస్ రిజల్ట్ ఏమైనా ఉండొచ్చు. కానీ మరీ ఏడో రోజే ఇలా స్ట్రీమింగ్ కి ఇచ్చేయడం వల్ల ప్రేక్షకులకు ఏం సంకేతం ఇస్తున్నారని నెటిజెన్లు నిలదీస్తున్నారు. ఒకపక్క సింగల్ స్క్రీన్లు తాత్కాలికంగా అయినా సరే మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతుంటే ఇంకోవైపు థియేటర్లలో ఆడుతున్న సినిమాని ఇలా ఓటిటికి ఇచ్చేయడం ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరకదు. బహుశా ఎలాగూ ఆడదని ముందే ఒప్పందం చేసుకున్నారా లేక ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమా అనేది నిర్మాతలకే తెలుసు.
ఇరవై రోజుల గ్యాపే చాలా తక్కువని భావిస్తున్న తరుణంలో మరీ ఏడు రోజులనేది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. బాలీవుడ్ లో ఇలా లేదు. ఖచ్చితంగా యాభై రోజుల కండీషన్ పాటిస్తేనే తమ స్క్రీన్లు ఇస్తామని మల్టీప్లెక్సులు గట్టి పట్టు పట్టడంతో నార్త్ ప్రొడ్యూసర్లు దాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే గత మూడేళ్ళలో ఏ హిందీ సినిమా నెల రోజుల్లో వచ్చిన దాఖలాలు కనిపించవు. అంతెందుకు మొదటి ఆటకే టపా కట్టిన బస్తర్ నక్సల్ స్టోరీ అందరూ మర్చిపోయాక వచ్చింది. జర హట్కే జర బచ్కెకు పదకొండు నెలలు పట్టింది. కానీ మన దక్షిణాదిలో మాత్రమే దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది.
This post was last modified on May 17, 2024 10:39 am
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…