Political News

151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులతో జగన్ చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన బృందానికి జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలిచామని, ఈ సారి అంతకన్నా ఎక్కువ స్థానాలు సాధించబోతున్నామని జోస్యం చెప్పారు.

ప్రజలకు సుపరిపాలన అందించామని, అందుకే, అఖండ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఉన్న హవా కన్నా 2024 ఎన్నికలకు ముందు ఉన్న హవా ఎక్కువని, భారీ మెజారిటీ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఐ-ప్యాక్ సభ్యులతో జగన్ అన్నారు. ఐ-ప్యాక్ టీమ్ ను ఉద్దేశించి జగన్ మాట్లాడుతున్న సందర్భంగా ఐ-ప్యాక్ హెడ్ రిషీ సింగ్ కూడా పక్కనే ఉన్నారు. ఈ సారి 151,22 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేయగా…అందుకు ఐ-ప్యాక్ టీం సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

2019 ఎన్నికలకు ముందు ఐ-ప్యాక్ హెడ్ గా ఉంటూ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఈ సారి జగన్ ఓటమి తప్పదని బల్లగుద్ది మరీ చెబుతున్న సంగతి తెలిసిందే. మరి, 2024 ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో జగన్, పీకేలలో ఎవరి జోస్యం నిజం కాబోతోంది అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.

This post was last modified on May 16, 2024 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

5 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

5 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

6 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

6 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

7 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

7 hours ago