Political News

151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులతో జగన్ చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన బృందానికి జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలిచామని, ఈ సారి అంతకన్నా ఎక్కువ స్థానాలు సాధించబోతున్నామని జోస్యం చెప్పారు.

ప్రజలకు సుపరిపాలన అందించామని, అందుకే, అఖండ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఉన్న హవా కన్నా 2024 ఎన్నికలకు ముందు ఉన్న హవా ఎక్కువని, భారీ మెజారిటీ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఐ-ప్యాక్ సభ్యులతో జగన్ అన్నారు. ఐ-ప్యాక్ టీమ్ ను ఉద్దేశించి జగన్ మాట్లాడుతున్న సందర్భంగా ఐ-ప్యాక్ హెడ్ రిషీ సింగ్ కూడా పక్కనే ఉన్నారు. ఈ సారి 151,22 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేయగా…అందుకు ఐ-ప్యాక్ టీం సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

2019 ఎన్నికలకు ముందు ఐ-ప్యాక్ హెడ్ గా ఉంటూ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఈ సారి జగన్ ఓటమి తప్పదని బల్లగుద్ది మరీ చెబుతున్న సంగతి తెలిసిందే. మరి, 2024 ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో జగన్, పీకేలలో ఎవరి జోస్యం నిజం కాబోతోంది అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.

Satya

Recent Posts

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

1 hour ago

హత్యలు చేసే డాక్టర్… చూసినట్టు ఉందే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…

1 hour ago

సత్యదేవ్ ఆశలన్నీ బహదూర్ మీదే

ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…

1 hour ago

గూండా ఎమోషన్ గుర్తు చేసిన మెగాస్టార్

నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…

2 hours ago

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

5 hours ago

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని…

5 hours ago