Political News

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో క‌లిసి పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటేయ‌డం విశేషం. మంగ‌ళ‌గిరిలోని పోలింగ్ కేంద్రంలో ఆయ‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పోలీసుల‌కు, పోలింగ్ సిబ్బందికి కొన్ని సూచ‌న‌లు చేశారు. తాగునీటి వ‌స‌తి క‌ల్పించాల‌ని.. టెంట్లు ఇంకా ఎక్కువ వేయాల‌ని సూచించారు.

అదేవిధంగా కేంద్రాల ముందు ప్ర‌జ‌లు బారులు తీరార‌ని.. వారిని ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. ఇక‌, మెగా స్టార్ చిరంజీవి దంప‌తులు.. హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓటేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని చిరు సూచించారు. ఈయ‌న మేన‌ల్లుడు.. బ‌న్నీ అల్లు అర్జున్ ఉద‌యాన్నే ఓటేశారు. ఈయ‌న మాట్లాడుతూ.. త‌న స్నేహితులు ఎక్క‌డున్నా ప్ర‌చారం చేసేందుకు వెళ్తాన‌ని.. ఇది త‌ప్పుకాద‌ని.. పార్టీల‌కు అతీతంగా స్నేహితులు త‌న‌కు ఉన్నార‌ని అన్నారు.

అదేవిధంగా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు కూడా ప‌లువురు ఉద‌యాన్నే పోలింగ్ బూతుల్లో క‌నిపిం చారు. యువ‌త వ‌చ్చి ఓట్లేయాల‌ని.. పోలింగ్ డే.. హాలీడే కాద‌ని వారు పిలుపునిచ్చారు. ప‌వ‌న్ కల్యాణ్.. పిఠాపురం నుంచి పోటీలో ఉన్నారు. కానీ, ఆయ‌న మంగ‌ళ‌గిరిలో ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా ఉద‌యాన్నే.. ఓట‌ర్లు పోలింగ్ బూతుల‌కు పోటెత్తారు. ఎండ‌వేడికి దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మొత్తానికి గ‌తానికి భిన్నంగా ఉద‌యం 5 గంట‌ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉద‌యం 6 నుంచి న‌గ‌ర, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఓట‌ర్లు పోటెత్తారు.

This post was last modified on May 13, 2024 11:24 am

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

39 minutes ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

39 minutes ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

4 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

4 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago