జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. గతానికి భిన్నంగా ఆయన ఈ సారి భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయడం విశేషం. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు, పోలింగ్ సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. తాగునీటి వసతి కల్పించాలని.. టెంట్లు ఇంకా ఎక్కువ వేయాలని సూచించారు.
అదేవిధంగా కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరారని.. వారిని ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇక, మెగా స్టార్ చిరంజీవి దంపతులు.. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఓటేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిరు సూచించారు. ఈయన మేనల్లుడు.. బన్నీ అల్లు అర్జున్ ఉదయాన్నే ఓటేశారు. ఈయన మాట్లాడుతూ.. తన స్నేహితులు ఎక్కడున్నా ప్రచారం చేసేందుకు వెళ్తానని.. ఇది తప్పుకాదని.. పార్టీలకు అతీతంగా స్నేహితులు తనకు ఉన్నారని అన్నారు.
అదేవిధంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా పలువురు ఉదయాన్నే పోలింగ్ బూతుల్లో కనిపిం చారు. యువత వచ్చి ఓట్లేయాలని.. పోలింగ్ డే.. హాలీడే కాదని వారు పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి పోటీలో ఉన్నారు. కానీ, ఆయన మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే.. ఓటర్లు పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఎండవేడికి దీనికి కారణమని తెలుస్తోంది. మొత్తానికి గతానికి భిన్నంగా ఉదయం 5 గంటల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉదయం 6 నుంచి నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తారు.
This post was last modified on May 13, 2024 11:24 am
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…