Political News

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల వ‌ర‌కు తెచ్చింది. సీఎం జ‌గ‌న్‌కు ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో.. ఏం చెప్పారో తెలియ‌దు కానీ.. ఆయ‌న ఏం చేసినా.. ఫొటోలు వేసుకోవ‌డం రివాజు. ఇంటి డోర్ నుంచి.. పిల్ల‌ల‌కు ఇచ్చే పుస్త‌కాల వ‌ర‌కు, మ‌హిళ‌ల‌కు ఇచ్చే ప‌థ‌కాల నుంచి పింఛ‌ను పుస్త‌కాల వ‌ర‌కు.. అన్నింటిపైనా సీఎం జ‌గ‌న్ బొమ్మ ఉండి తీరాల్సిందే అన్న పంథాను పాటించారు.

చివ‌ర‌కు ప్ర‌తిష్టాత్మకంగా చేప‌ట్టిన భూ స‌ర్వేకు సంబంధించి కొనుగోలు చేసిన‌ స‌రిహ‌ద్దు రాళ్ల పై కూడా.. జ‌గన్ చిత్త‌రువుల‌ను చెక్కించారు. ఈ ప‌రిణామంతో త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని… తెల్లారిలేస్తే.. ప్ర‌తి ఒక్క‌రికీ క‌ళ్ల‌ముందు ‘జ‌గ‌న్‌’ క‌నిపిస్తార‌ని.. దీంతో వ‌రుస‌గా రెండో సారి కూడా అధికారంలోకి వ‌చ్చేయొచ్చ ని పార్టీ ఆశించింది. సలహా ఎవరిదైనా మ‌రి ఆలోచ‌న చేయాల్సిన సీఎం జ‌గ‌న్‌.. వారికి జై కొట్టారు. ఇంటింటా త‌న బొమ్మ ఉండేలా వ్య‌వ‌హ‌రించారు.

ఫ‌లితంగా ఇప్పుడు పీక‌ల వ‌ర‌కు వ‌చ్చింది. ఏకంగా ఆస్తి ప‌త్రాల‌పైనే త‌న ఫొటో వేసుకున్న తీరును.. ప్ర‌తిప‌క్షాలు ఎండగడుతున్నాయి. దీంతో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక చేతులు ముడుచుకోవాల్సిన ప‌రిస్థితి వైసీపీ శిబిరం వంతైంది. “మీ ఆస్తులు దోచేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మీ ఆస్తుల‌పై మీ ఫొటోలు కాకుండా.. జ‌గ‌న్ ఫొటోలు వేసుకున్నాడంటే అర్థం ఇదే” అని చంద్ర‌బాబు స‌హా కూట‌మి శిబిరం నాయ‌కులు చేస్తున్న ప్ర‌చారం.. వైసీపీకి ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సంక్షేమ వాద‌న‌.. మీ బిడ్డ అనే వాద‌న‌లు కూడా ప‌క్క‌కు జ‌రిగిపోయి.. ఫొటోల రాజ‌కీయం వీరంగం వేస్తోంది. చివరకు మీ బిడ్డ అన్న జగన్ ఊతపదాన్ని కూడా వాడుకుని మీ బిడ్డ కాబట్టి మీ ఆస్తి తీసుకుంటాడు అంటూ అందులో తప్పేముందంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా.. ప్ర‌జ‌ల ఆస్తి ప‌త్రాలు, ప‌ట్టా(జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కంలో)ల‌పైనా సీఎం జ‌గ‌న్ బొమ్మ‌లు వేసుకున్న తీరును ప్ర‌తిప‌క్షాలు లోతుగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాయి. తీసుకువెళ్తున్నాయి. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల‌కు ఆస్తితో ఎన‌లేని బంధం ఏర్ప‌డుతోంది. ఈ విష‌యంలో చిన్న తేడా వ‌చ్చినా.. క్రైమ్‌కు కూడా దారితీస్తున్న ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది. అలాంటిది ఇప్పుడు జ‌గ‌నే త‌మ భూములు కొట్టేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్న ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌ను వారు విశ్వ‌సించే ప‌రిస్థితి వచ్చింది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తాను కూడా బాధితుడినే అనడంత ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో జగన్ తన కోసం చేసుకున్న పబ్లిసిటీయే ఆయన కొంపముంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తరతరాలుగా ఆస్తిపత్రాలపై ఏ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోలేదు. ఎప్పట్నుంచో గవర్నమెంట్ లోగో మాత్రమే ఉండేది. జగన్ వచ్చాక కొత్త చట్టం తెచ్చి జగన్ ఫొటో వేయడంతో ప్రభుత్వం కూలే పరిస్థితి వచ్చింది.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

51 minutes ago

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

7 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

7 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

9 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

9 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

10 hours ago