Political News

బీజేపీకి దక్షిణం ‘దారి’ చూపుతుందా ?

400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఇంతవరకు ఖాతానే తెరవలేదు. ఇక కర్ణాటకలో పోయినసారి 28 లోక్ సభ స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. తెలంగాణలో 17 స్థానాలకు 4 స్థానాలలో విజయం సాధించింది.

దక్షిణాదిన ఉన్న 130 స్థానాలలో 29 స్థానాలలోనే బీజేపీ విజయం సాధించింది. అంటే 101 స్థానాలలో గెలుపుకు దూరంగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి పరిస్థితి ఏంటి ? ఉత్తరాదిన గతంలో ఉన్న ఆదరణ ఉండదని తొలి, మలి దశ ఎన్నికల పోలింగ్ గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో దక్షిణాది ఈ సారి బీజేపీకీ కేంద్రంలో అధికారానికి దారి చూపుతుందా ? అంటే ఫలితాలు వస్తేనే గాని ఏమీ చెప్పలేదని పరిస్థితి.

దక్షిణాది మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన మోడీ పదే పదే ఇక్కడ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పర్యటించాడు. దక్షిణాదిన ప్రధాని మోదీ ఇప్పటివరకు 146 సార్లు పర్యటించాడు. అందులో 64 అధికారిక కార్యక్రమాలు కాగా, 56 పర్యటనలు పార్టీ తరపున నిర్వహించినవి. అంటే ఇక్కడ పాగా కోసం ఎంతలా శ్రమిస్తున్నారో అర్ధమవుతుంది.

ఈసారి తమిళనాడులో మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోవడం వీలుకాకుంటే ఓటు షేర్ పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నది. 2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్‌ 17వరకు తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడులలో మోదీ 146 సార్లు పర్యటించారు. తన రెండు విడతల పదవీకాలంలో 73 సార్ల చొప్పున ఈ 5 రాష్ట్రాల్లో తిరిగారు. ప్రధాని కార్యాలయంలోని రికార్డుల ప్రకారం.. గత మూడేళ్లలోనే దక్షిణాది రాష్ట్రాల్లో 59 పర్యటనలు జరపడం గమనార్హం.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని బీజేపీ అంచనా వేస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి 0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి ఏపీలోె పొత్తులో భాగంగా 6 స్థానాలలో బీజేపీ పోటీ చేస్తున్నది. తెలంగాణలో ఈ సారి పది సీట్లు లక్ష్యంగా పెట్టుకుని సర్వశక్తులూ ఒడ్డుతున్నది. అయితే పోయినసారి కర్ణాటకలో 25 స్థానాలు గెలవగా, ఈ సారి అక్కడ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం, అతడు విదేశాలకు పారిపోవడం బీజేపీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నది. మరి ఈ సారి దక్షిణాది బీజేపీకి ఎంతవరకు సాయపడుతుందో వేచిచూడాలి.

This post was last modified on May 8, 2024 11:15 am

Share

Recent Posts

సుడిగాడు-2… వామ్మో అంటున్న అల్లరి నరేష్

తెలుగులో కామెడీ సినిమాలతోనూ స్టార్ కావచ్చని ముందుగా రుజువు చేసింది రాజేంద్ర ప్రసాద్ అయితే.. ఆయన తరువాత ఆ స్థాయిలో…

46 minutes ago

కంచుకోట‌లో కొత్త క్యాండెట్‌ను రెడీ చేస్తోన్న జ‌గ‌న్‌..?

రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు…

3 hours ago

దుల్కర్ బెస్ట్ ‘సీతారామం’ కాదట

మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…

5 hours ago

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

8 hours ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

9 hours ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

11 hours ago