Movie News

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పన్నెండు రోజుల పాటు చిత్రీకరించబోతున్నట్టు వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎపిక్ పీరియాడిక్ డ్రామాలో సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కార్తికేయ 2 కంటే ఎన్నో రెట్లు పెద్ద ఖర్చుతో వస్తున్న స్వయంభు కోసం నిఖిల్ కష్టపడి యుద్ధ విద్యలు, కత్తిసాము నేర్చుకున్నాడు.

ఇక సవాళ్ల విషయానికి వస్తే రాబోయే తొమ్మిది నెలల్లో స్వయంభు తరహా ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఇంకో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. మొదటిది కల్కి 2898 ఏడి. వచ్చే నెల ఇరవై ఏడున విడుదల కానుంది. నాగ అశ్విన్ టేకింగ్ గురించి ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. రెండోది చిరంజీవి విశ్వంభర. 2025 జనవరి 10 విడుదల లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వశిష్ట పక్కా ప్లానింగ్ ఆలస్యం లేకుండా చూసుకుంటున్నాడు. ఇక మూడోది సూర్య కంగువా. దాదాపు చివరి దశలో ఉంది.

వీటికి స్వయంభుకున్న సంబంధం జానర్ పరంగా తప్ప కథ గురించి కాదు. వీటిలో కల్కి మాత్రమే స్వయంభు కంటే ముందు వస్తోంది. సో నిఖిల్ బృందం సాధ్యమైనంత మేరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందేమో చూసుకోవాలి. కంగువ ఈ ఏడాదే అన్నారు కానీ ఎంతమేరకు సాధ్యమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. స్వయంభు కనక ముందే వచ్చేసి బ్లాక్ బస్టర్ కొడితే పోలికల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా పురాణాలు, ఇతిసహసాలు బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ మూవీ చాలా హోమ్ వర్క్ చేసింది. ఇది కనక బ్రేక్ ఇస్తే నిఖిల్ మార్కెట్ మరింత విస్తరిస్తుంది. తన లక్ష్యం అదే.

This post was last modified on May 8, 2024 7:14 am

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

4 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

8 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago