రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ను ఓడించేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ ప్రతిమండలంలోనూ…. కీలక నేతలను రంగంలోకి దింపి.. పార్టీని పరుగులు పెట్టిస్తోంది. పార్టీ సీనియర్ నాయకురాలు.. వంగా గీత గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. దీనికి ముద్ర గడ పద్మనాభం కూడా తోడయ్యారు.
ఈయనను తనవైపు తిప్పుకొన్న.. వైసీపీ ఆయనతోనే.. ఇక్కడ పొలిటికల్ గేమ్కు తెరదీసింది. పవన్ను ఓడించాలంటే.. బలమైన కాపు ఉద్యమ నాయకుడు అవసరం అనుకున్నారో.ఏమో.. సీఎం జగన్ షెడ్యూ ల్ విడుదలకు ముందు ఆయనను పార్టీలో కి చేర్చుకున్నారు. ఇక, పద్మనాభం కూడా.. తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. పవన్పై చిర్రుబుర్రులాడుతున్నారు. తనను అవమానించారంటూ.. మొదలు పెట్టిన ఆయన మాటల యుద్ధం.. చివరకు.. పవన్ను ఓడించి తీరుతానని శపథం చేసే వరకు వచ్చింది.
అక్కడితోకూడా ముద్రగడ ఆగలేదు.. పవన్ను ఓడించకపోతే.. తనపేరును `పద్మనాభంరెడ్డి`గా మార్చు కుంటానని చెప్పారు. ఇంత కసిపై ఉన్న ఆయనకు ఎవరు సహకరిస్తున్నారో.. లేదో చెప్పడం కష్టమే అయినా.. ఇప్పుడు ఆయన కుటుంబంలోనే కల్లోలం రేగింది. ముద్రగడ కుమార్తె క్రాంతి ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ను ఓడిస్తానని చెబుతున్న ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. జగన్.. తన తండ్రిని నమ్ముకుని నట్టేట మునుగుతున్నారని క్రాంతి వ్యాఖ్యాలు చేశారు.
“పవన్ను తిట్టేందుకే మా నాన్నను సీఎం జగన్ వాడుకుంటున్నారు. ఇది సరికాదు. ఎన్నికల తర్వాత.. మా నాన్న ఎటూ కాకుండా పోతారు“ అని క్రాంతి ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఓడించేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్న ఆమె.. తన తండ్రి చేసిన శపథాన్ని తప్పుబట్టారు. తాను మాత్రం పవన్ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పడం గమనార్హం. అయితే.. ఇలా ముద్రగడ కుటుంబంలో చీలిక రావడంఅందరినీ విస్మయానికిఆశ్చర్యానికి కూడా గురిచేస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…