జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మొత్తం 35 మంది నామినేషన్లు వేశారు. వీరిలో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ రెండు సెట్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ఇక, మిగిలిన వారంతా చిన్న చితకా పార్టీలకు చెందిన వారు కాగా.. ఇతరులు ఇండిపెండెంట్లు. అయితే.. వీరిలోనూ ఒకరు స్థానికంగా చెప్పులు కుట్టుకునే అభ్యర్థి ఉండడం గమనార్హం.
పిఠాపురంలోని సీతయ్యగారి తోటకు చెందిన ఏడిద భాస్కరరావు.. రెండు దశాబ్దాలుగా చెప్పులు కుట్టుకుం టూ.. జీవనం సాగిస్తున్నారు. ఇంటర్ వరకు రెగ్యులర్గా చదివిన భాస్కరరావు.. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకే షన్ ద్వారా.. పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియో జకవర్గంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రంలో తాను ఎంఏ చదవినట్టు పేర్కొన్నారు. తన ఆస్తులు రూ.లక్ష వరకు ఉన్నాయని, చేతిలో రూ.20 వేలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
ఇక, తన వృత్తిని చెప్పులు కుట్టుకునే వృత్తిగా పేర్కొన్నారు. స్థానిక ప్రబుత్వ కాలేజీ వద్ద ఉన్న చెట్టు కిందే తన వృత్తిని రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్టు 46 ఏళ్ల ఏడిద భాస్కరరావు పేర్కొన్నారు. అయితే.. ఈయన నామినేషన్ తిరస్కరిస్తారా. లే క కొనసాగిస్తారా? అనేది పక్కన పెడితే.. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును ఆయన సంపూర్ణంగా వినియోగించుకుంటుండడం పట్ల యువత సహా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఆయన ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు. తనను కలిసి మీడియాకు మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే.. ప్రజలకు సేవ చేస్తానని చెబుతున్నారు. తన వెనుక ఏ పార్టీ ప్రోత్సాహం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…