Political News

చేతిలో రూ.20 వేలుతో పిఠాపురంలో నామినేష‌న్‌.. !

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో ఆస‌క్తికర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మొత్తం 35 మంది నామినేష‌న్లు వేశారు. వీరిలో వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతా విశ్వ‌నాథ్ రెండు సెట్లు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌.. నాలుగు సెట్ల నామినేష‌న్లు వేశారు. ఇక‌, మిగిలిన వారంతా చిన్న చిత‌కా పార్టీల‌కు చెందిన వారు కాగా.. ఇత‌రులు ఇండిపెండెంట్లు. అయితే.. వీరిలోనూ ఒక‌రు స్థానికంగా చెప్పులు కుట్టుకునే అభ్య‌ర్థి ఉండ‌డం గ‌మ‌నార్హం.

పిఠాపురంలోని సీత‌య్య‌గారి తోట‌కు చెందిన ఏడిద భాస్క‌ర‌రావు.. రెండు ద‌శాబ్దాలుగా చెప్పులు కుట్టుకుం టూ.. జీవ‌నం సాగిస్తున్నారు. ఇంట‌ర్ వ‌రకు రెగ్యుల‌ర్‌గా చ‌దివిన భాస్క‌ర‌రావు.. త‌ర్వాత డిస్టెన్స్ ఎడ్యుకే ష‌న్ ద్వారా.. పొలిటిక‌ల్ సైన్స్‌లో పీజీ చేశారు. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న పిఠాపురం నియో జక‌వ‌ర్గంలో ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేశారు. నామినేష‌న్ ప‌త్రంలో తాను ఎంఏ చ‌ద‌వినట్టు పేర్కొన్నారు. త‌న ఆస్తులు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉన్నాయ‌ని, చేతిలో రూ.20 వేలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు.

ఇక‌, త‌న వృత్తిని చెప్పులు కుట్టుకునే వృత్తిగా పేర్కొన్నారు. స్థానిక ప్ర‌బుత్వ కాలేజీ వ‌ద్ద ఉన్న చెట్టు కిందే త‌న వృత్తిని రెండు ద‌శాబ్దాలుగా కొన‌సాగిస్తున్న‌ట్టు 46 ఏళ్ల ఏడిద భాస్క‌ర‌రావు పేర్కొన్నారు. అయితే.. ఈయ‌న నామినేష‌న్ తిర‌స్క‌రిస్తారా. లే క కొన‌సాగిస్తారా? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌జాస్వామ్యంలో పోటీ చేసే హ‌క్కును ఆయ‌న సంపూర్ణంగా వినియోగించుకుంటుండ‌డం ప‌ట్ల యువ‌త స‌హా అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఆయ‌న ఎక్క‌డా ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. త‌న‌ను క‌లిసి మీడియాకు మాత్రం ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. త‌న‌ను గెలిపిస్తే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని చెబుతున్నారు. త‌న వెనుక ఏ పార్టీ ప్రోత్సాహం లేద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.

This post was last modified on April 26, 2024 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

28 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago