Political News

చేతిలో రూ.20 వేలుతో పిఠాపురంలో నామినేష‌న్‌.. !

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో ఆస‌క్తికర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మొత్తం 35 మంది నామినేష‌న్లు వేశారు. వీరిలో వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతా విశ్వ‌నాథ్ రెండు సెట్లు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌.. నాలుగు సెట్ల నామినేష‌న్లు వేశారు. ఇక‌, మిగిలిన వారంతా చిన్న చిత‌కా పార్టీల‌కు చెందిన వారు కాగా.. ఇత‌రులు ఇండిపెండెంట్లు. అయితే.. వీరిలోనూ ఒక‌రు స్థానికంగా చెప్పులు కుట్టుకునే అభ్య‌ర్థి ఉండ‌డం గ‌మ‌నార్హం.

పిఠాపురంలోని సీత‌య్య‌గారి తోట‌కు చెందిన ఏడిద భాస్క‌ర‌రావు.. రెండు ద‌శాబ్దాలుగా చెప్పులు కుట్టుకుం టూ.. జీవ‌నం సాగిస్తున్నారు. ఇంట‌ర్ వ‌రకు రెగ్యుల‌ర్‌గా చ‌దివిన భాస్క‌ర‌రావు.. త‌ర్వాత డిస్టెన్స్ ఎడ్యుకే ష‌న్ ద్వారా.. పొలిటిక‌ల్ సైన్స్‌లో పీజీ చేశారు. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న పిఠాపురం నియో జక‌వ‌ర్గంలో ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేశారు. నామినేష‌న్ ప‌త్రంలో తాను ఎంఏ చ‌ద‌వినట్టు పేర్కొన్నారు. త‌న ఆస్తులు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉన్నాయ‌ని, చేతిలో రూ.20 వేలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు.

ఇక‌, త‌న వృత్తిని చెప్పులు కుట్టుకునే వృత్తిగా పేర్కొన్నారు. స్థానిక ప్ర‌బుత్వ కాలేజీ వ‌ద్ద ఉన్న చెట్టు కిందే త‌న వృత్తిని రెండు ద‌శాబ్దాలుగా కొన‌సాగిస్తున్న‌ట్టు 46 ఏళ్ల ఏడిద భాస్క‌ర‌రావు పేర్కొన్నారు. అయితే.. ఈయ‌న నామినేష‌న్ తిర‌స్క‌రిస్తారా. లే క కొన‌సాగిస్తారా? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌జాస్వామ్యంలో పోటీ చేసే హ‌క్కును ఆయ‌న సంపూర్ణంగా వినియోగించుకుంటుండ‌డం ప‌ట్ల యువ‌త స‌హా అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఆయ‌న ఎక్క‌డా ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. త‌న‌ను క‌లిసి మీడియాకు మాత్రం ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. త‌న‌ను గెలిపిస్తే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని చెబుతున్నారు. త‌న వెనుక ఏ పార్టీ ప్రోత్సాహం లేద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.

This post was last modified on April 26, 2024 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

11 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

42 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago