జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మొత్తం 35 మంది నామినేషన్లు వేశారు. వీరిలో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ రెండు సెట్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ఇక, మిగిలిన వారంతా చిన్న చితకా పార్టీలకు చెందిన వారు కాగా.. ఇతరులు ఇండిపెండెంట్లు. అయితే.. వీరిలోనూ ఒకరు స్థానికంగా చెప్పులు కుట్టుకునే అభ్యర్థి ఉండడం గమనార్హం.
పిఠాపురంలోని సీతయ్యగారి తోటకు చెందిన ఏడిద భాస్కరరావు.. రెండు దశాబ్దాలుగా చెప్పులు కుట్టుకుం టూ.. జీవనం సాగిస్తున్నారు. ఇంటర్ వరకు రెగ్యులర్గా చదివిన భాస్కరరావు.. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకే షన్ ద్వారా.. పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియో జకవర్గంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రంలో తాను ఎంఏ చదవినట్టు పేర్కొన్నారు. తన ఆస్తులు రూ.లక్ష వరకు ఉన్నాయని, చేతిలో రూ.20 వేలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
ఇక, తన వృత్తిని చెప్పులు కుట్టుకునే వృత్తిగా పేర్కొన్నారు. స్థానిక ప్రబుత్వ కాలేజీ వద్ద ఉన్న చెట్టు కిందే తన వృత్తిని రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్టు 46 ఏళ్ల ఏడిద భాస్కరరావు పేర్కొన్నారు. అయితే.. ఈయన నామినేషన్ తిరస్కరిస్తారా. లే క కొనసాగిస్తారా? అనేది పక్కన పెడితే.. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును ఆయన సంపూర్ణంగా వినియోగించుకుంటుండడం పట్ల యువత సహా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఆయన ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు. తనను కలిసి మీడియాకు మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే.. ప్రజలకు సేవ చేస్తానని చెబుతున్నారు. తన వెనుక ఏ పార్టీ ప్రోత్సాహం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
This post was last modified on April 26, 2024 2:40 pm
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…