Political News

ఉండి నుంచే ఆర్ఆర్ఆర్.. మొత్తం ఐదు మార్పులు

మొత్తానికి సస్పెన్స్ వీడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చేసింది. ఆదివారం నాడు మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులందరికీ బీఫారాలు ఇచ్చేశారు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రఘురామ కృష్ణంరాజు అభ్యర్థిత్వం విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది.

ఆయన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాను సోమవారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్ వేయనున్న విషయాన్ని కూడా రఘురామ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. రఘురామ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తన స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన్ని నరసాపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటిదాకా ఆ పదవిలో ఉన్న మాజీ ఎంపీ తోలట సీతారామలక్ష్మిని టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. దీంతో పాటుగా మరో నలుగురు అభ్యర్థులను మార్చింది తెలుగుదేశం పార్టీ.

పెందుర్తి స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ అవకాశం కోల్పోయిన బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేష్ నాయుడికి కేటాయించగా.. ఆయన్ని మార్చి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇచ్చారు. మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు ఛాన్స్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేయగా.. ఇప్పుడు ఆమెను తప్పించి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించారు.

This post was last modified on April 21, 2024 4:47 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago