శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుండి ఈ నెల 22న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, నా భర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి, జడ్పీటీసీ సభ్యురాలు వాణి తన అనుచరుల ముందు ప్రకటించి ప్రతినబూనారు. తన జన్మదినం సంధర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానుల ముందు ఆమె ఈ విషయం ప్రకటించి కలకలంరేపారు.
దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి శాసనసభ స్థానం నుండి శుక్రవారం నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే హఠాత్తుగా ఆయన భార్య పోటీ విషయం వెల్లడించడంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం మొదలయింది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య ఉన్న విభేదాల మూలంగా ఈ పరిస్థితి దాపురించిందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
దువ్వాడ వ్యవహారశైలి మూలంగా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని ఆయన సతీమణి వాణి నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు చెప్పినట్లు సమాచారం. ఆ పరిస్థితులలో నియోజకవర్గ ఇంఛార్జ్ గా పార్టీ వాణిని నియమించింది. అయితే అభ్యర్థిగా మాత్రం భర్త దువ్వాడ శ్రీనివాస్ ను ప్రకటించింది. దీంతో పార్టీతో విభేధించిన వాణి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకుల ప్రోత్సాహంతో వాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on April 19, 2024 10:43 am
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…