Political News

బాబుకు బీపీ తెప్పిస్తున్న బండారు !

టీడీపీ, జనసేన పొత్తు కొన్ని చోట్ల టీడీపీకి తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను తప్పనిసరి పరిస్థితులలో వదులుకోవాల్సిన నేపథ్యంలో పార్టీలో ఉండి అవకాశం కోల్పోయిన నేతలను బుజ్జగించలేక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటున్నది. విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ స్థానాన్ని 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆ నియోజకవర్గాన్ని ఈ సారి పట్టుబట్టి పొత్తులో భాగంగా తీసుకుంది.

జనసేన తరపున ఇక్కడి నుండి వైసీపీని వీడి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబును ఎమ్మెల్యేగా పోటీకి దింపారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లడం ఒకటైతే, అక్కడ తన చిరకాల ప్రత్యర్ధి పంచకర్ల రమేష్ బాబును పోటీకి దింపడం, అతడి గెలుపుకు తనను పనిచేయాలని చెప్పడం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత బండారు సత్యనారాయణకు ఏ మాత్రం రుచించడం లేదు.

పొత్తులో భాగంగా ఈ స్థానం పక్కకు పోతుందని ఊహించిన బండారు సత్యనారాయణ ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. అయినా ఈ స్థానం కోసం టీడీపీ పట్టుబట్టలేదు. దీంతో తన ప్రత్యర్ధి గెలుపు కోసం తాను పనిచేయలేనని బండారు సహాయ నిరాకరణ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీలో ఉన్న గండి బాబ్జి వర్గం బండారుతో సంబంధం లేకుండా జనసేన అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కూడా బండారుకు రుచించడం లేదు. విషయం తెలుసుకున్న చంద్రబాబు బండారును పిలిచి బుజ్జగించినా వినకపోవడంతో ఫైర్ అయినట్లు సమాచారం. ఈ సహాయ నిరాకరణ ఎక్కడికి దారితీస్తుందోనని రాజకీయ వర్గాలు వేచిచూస్తున్నాయి.

This post was last modified on April 17, 2024 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

4 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago