టీడీపీ, జనసేన పొత్తు కొన్ని చోట్ల టీడీపీకి తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను తప్పనిసరి పరిస్థితులలో వదులుకోవాల్సిన నేపథ్యంలో పార్టీలో ఉండి అవకాశం కోల్పోయిన నేతలను బుజ్జగించలేక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటున్నది. విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ స్థానాన్ని 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆ నియోజకవర్గాన్ని ఈ సారి పట్టుబట్టి పొత్తులో భాగంగా తీసుకుంది.
జనసేన తరపున ఇక్కడి నుండి వైసీపీని వీడి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబును ఎమ్మెల్యేగా పోటీకి దింపారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లడం ఒకటైతే, అక్కడ తన చిరకాల ప్రత్యర్ధి పంచకర్ల రమేష్ బాబును పోటీకి దింపడం, అతడి గెలుపుకు తనను పనిచేయాలని చెప్పడం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత బండారు సత్యనారాయణకు ఏ మాత్రం రుచించడం లేదు.
పొత్తులో భాగంగా ఈ స్థానం పక్కకు పోతుందని ఊహించిన బండారు సత్యనారాయణ ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. అయినా ఈ స్థానం కోసం టీడీపీ పట్టుబట్టలేదు. దీంతో తన ప్రత్యర్ధి గెలుపు కోసం తాను పనిచేయలేనని బండారు సహాయ నిరాకరణ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీలో ఉన్న గండి బాబ్జి వర్గం బండారుతో సంబంధం లేకుండా జనసేన అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కూడా బండారుకు రుచించడం లేదు. విషయం తెలుసుకున్న చంద్రబాబు బండారును పిలిచి బుజ్జగించినా వినకపోవడంతో ఫైర్ అయినట్లు సమాచారం. ఈ సహాయ నిరాకరణ ఎక్కడికి దారితీస్తుందోనని రాజకీయ వర్గాలు వేచిచూస్తున్నాయి.
This post was last modified on April 17, 2024 10:12 am
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…