వైసీపీకి షాక్. అవును.. సీఎం జగన్పై రాయి దాడిని వాడుకుని సింపతీ పొందాలని చూసిన ఆ పార్టీకి గట్టిదెబ్బ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్పై దాడికి టీడీపీ అధినేత చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ, ఇది టీడీపీ కుట్ర అంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిక ఇలాంటి ఆరోపణలు చేసేముందు వైసీపీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై రాళ్ల దాడి జరగడంతో వైసీపీ మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడలో జగన్పై రాయితో దాడి జరిగిన మరుసటి రోజే గాజువాకలో బాబుపై, తెనాలిలో పవన్పై రాయితో దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలతో వైసీపీకి దిమ్మ తిరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్పై దాడి టీడీపీ పనే అంటూ ఇప్పుడు గట్టిగా ఆరోపించలేని పరిస్థితి వైసీపీది. ఎందుకంటే జగన్పై దాడి టీడీపీ చేయించిందంటే.. ఇప్పుడు పవన్, బాబుపై దాడి వైసీపీనే చేయించిందనే కౌంటర్ వచ్చే అవకాశముంది. ఒకవేళ పవన్, బాబుపై రాళ్ల దాడి డ్రామా అని వైసీపీ విమర్శిస్తే.. అప్పుడు జగన్పై దాడి కూడా డ్రామానే అని టీడీపీ, జనసేన కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వొచ్చు.
ఇలా మొత్తానికి రాయితో దాడితో జగన్కు ఒరిగిదేమీ లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలా జరిగిందో కానీ బాబు, పవన్పై రాళ్ల దాడితో వైసీపీకి రాజకీయంగా డ్యామేజీ కలిగే అవకాశముందని చెబుతున్నారు. దీంతో వైసీపీ నాయకులు సైలెంట్ అవాల్సిన పరిస్థితి తలెత్తిందనే చెప్పాలి. ఇప్పుడిదే టీడీపీ, జనసేనకు కలిసొచ్చే అంశంగా మారింది. మరి ఈ విషయంలో జగన్, వైసీపీ నాయకులు ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో చూడాలి.
This post was last modified on April 15, 2024 3:45 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…