వైసీపీకి షాక్. అవును.. సీఎం జగన్పై రాయి దాడిని వాడుకుని సింపతీ పొందాలని చూసిన ఆ పార్టీకి గట్టిదెబ్బ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్పై దాడికి టీడీపీ అధినేత చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ, ఇది టీడీపీ కుట్ర అంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిక ఇలాంటి ఆరోపణలు చేసేముందు వైసీపీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై రాళ్ల దాడి జరగడంతో వైసీపీ మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడలో జగన్పై రాయితో దాడి జరిగిన మరుసటి రోజే గాజువాకలో బాబుపై, తెనాలిలో పవన్పై రాయితో దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలతో వైసీపీకి దిమ్మ తిరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్పై దాడి టీడీపీ పనే అంటూ ఇప్పుడు గట్టిగా ఆరోపించలేని పరిస్థితి వైసీపీది. ఎందుకంటే జగన్పై దాడి టీడీపీ చేయించిందంటే.. ఇప్పుడు పవన్, బాబుపై దాడి వైసీపీనే చేయించిందనే కౌంటర్ వచ్చే అవకాశముంది. ఒకవేళ పవన్, బాబుపై రాళ్ల దాడి డ్రామా అని వైసీపీ విమర్శిస్తే.. అప్పుడు జగన్పై దాడి కూడా డ్రామానే అని టీడీపీ, జనసేన కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వొచ్చు.
ఇలా మొత్తానికి రాయితో దాడితో జగన్కు ఒరిగిదేమీ లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలా జరిగిందో కానీ బాబు, పవన్పై రాళ్ల దాడితో వైసీపీకి రాజకీయంగా డ్యామేజీ కలిగే అవకాశముందని చెబుతున్నారు. దీంతో వైసీపీ నాయకులు సైలెంట్ అవాల్సిన పరిస్థితి తలెత్తిందనే చెప్పాలి. ఇప్పుడిదే టీడీపీ, జనసేనకు కలిసొచ్చే అంశంగా మారింది. మరి ఈ విషయంలో జగన్, వైసీపీ నాయకులు ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో చూడాలి.
This post was last modified on April 15, 2024 3:45 pm
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్…
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…