కరోనా వైరస్ కు విరుగుడుగా మనదేశంలో జరుగుతున్న పరిశోధనలు ఫలితాలనిస్తే వచ్చే ఏడాదిలో మందు తయారయ్యేట్లుంది. ఈ విషయాన్ని కేంద్రం ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
మనదేశంలో వైద్య నియంత్రణ సంస్ధ ఐసిఎంఆర్ అనుమతులు తీసుకుని అనేక ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ కనిపిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో ముంబాయ్, హైదరాబాద్, పూనా లాంటి నగరాల్లోని వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు ఇదే పనిమీద 24 గంటలూ పని చేస్తున్నారు.
మనదేశంలో జరుగుతున్నట్లే యావత్ ప్రపంచం కూడా అనేక పరిశోధనలు చేస్తున్నాయి. రష్యా, అమెరికా, బ్రిటన్ లోని కంపెనీలు వ్యాక్సిన్ కనుగొనటంలో ముందజంలో ఉన్నాయి. ఇందులో భాగంగానే రష్యాలో స్పుత్నిక్ పేరుతో కరోనా వ్యాక్సిన్ తయారైంది.
దీన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆయన కూతురు తదితరులపై ఇప్పటికే ప్రయోగించిన విషయం అందరికీ తెలిసిందే. సరే రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ పై అమెరికా తదితర దేశాల్లో కొంత గందరగోళం ఉన్నా రష్యా మాత్రం తన పంథాలో ముందుకెళిపోతోంది. అందుకనే రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ ను మనదేశంలో ప్రయోగించే విషయంలో ఆలోచన చేస్తున్నారు.
ఇదే విషయమై హర్షవర్ధన్ మాట్లాడుతూ విదేశాల వ్యాక్సిన విషయాన్ని పక్కనపెట్టేసి మన కంపెనీలే వ్యాక్సిన్ తయారీలో స్పీడుగా ఉన్నట్లు చెప్పారు. బహుశా వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ లోపల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తానే మొదటి వ్యాక్సిన్ వేసుకోవటానికి కూడా మంత్రి రెడీ అయిపోయారు.
కరోనా వారియర్స్ , వృద్ధులకు వ్యాక్సిన్ వేయటంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు కూడా చెప్పారు. వ్యాక్సిన్, ధర, సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై ప్రత్యేక కమిటి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మంత్రి జోరు చూస్తుంటే వ్యాక్సిన్ వచ్చే ఏడాది వచ్చేది ఖాయమనే నమ్మకం పెరిగిపోతోంది. అదే నిజమైతే అంతకన్నా కావాల్సిందేముంది.
This post was last modified on September 14, 2020 10:12 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…