కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడింది. మనం ఊహించినదానికంటే ఎక్కువగా ఇండియాలో కరోనా ఉంది. 30-40 రోజుల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఇపుడు బయటపడుతున్నాయి. దీనిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం కరోనా కర్నూలులో నాలుగో దశలో ఉంది. నాకు తెలిసి దేశంలో కరోనా సుమారు 2 కోట్ల మందికి సోకి ఉంటుంది అని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సమస్య ఎక్కువ కావడం లేదు, సమస్య ప్రపంచమంతటా ఉంది.
మన వద్ద కూడా ఉంది. ఒక్కో కేసు వచ్చిన కొద్దీ చుట్టుపక్కల అందరికీ టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడుతోంది అని ఆయన చెబుతున్నారు. మొత్తం 130 కోట్ల మందికీ టెస్టులు చేస్తే కనీసం 2-3 కోట్ల మందికి పాజిటివ్ ఉంటుందని చాలా సింపుల్ గా చెప్పేశారు ఎంపీ సంజీవ్.
తన ఇంట్లో 6 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో నలుగురు డాక్టర్లు. సమాజానికి బ్యాక్ బోన్ వంటి వృత్తుల్లో ఒకటైన డాక్టర్లను కరోనా వచ్చిందని చెప్పి క్వారంటైన్లో పడేయడం, బ్లాక్ లిస్టులో పెట్టడం ఇదంతా మంచిది కాదని చాలా తేలికగా వ్యాఖ్యానించారు సంజీవ్ కుమార్. చిత్రమైన విషయం ఏంటంటే.. ఈయన స్వతహాగా డాక్టరు. అయినా విషయాన్ని చాలా తేలికగా చెప్పేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…