Political News

‘భారతదేశంలో ఆల్రెడీ 2 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుంది’

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడింది. మనం ఊహించినదానికంటే ఎక్కువగా ఇండియాలో కరోనా ఉంది. 30-40 రోజుల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఇపుడు బయటపడుతున్నాయి. దీనిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం కరోనా కర్నూలులో నాలుగో దశలో ఉంది. నాకు తెలిసి దేశంలో కరోనా సుమారు 2 కోట్ల మందికి సోకి ఉంటుంది అని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సమస్య ఎక్కువ కావడం లేదు, సమస్య ప్రపంచమంతటా ఉంది.

మన వద్ద కూడా ఉంది. ఒక్కో కేసు వచ్చిన కొద్దీ చుట్టుపక్కల అందరికీ టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడుతోంది అని ఆయన చెబుతున్నారు. మొత్తం 130 కోట్ల మందికీ టెస్టులు చేస్తే కనీసం 2-3 కోట్ల మందికి పాజిటివ్ ఉంటుందని చాలా సింపుల్ గా చెప్పేశారు ఎంపీ సంజీవ్.

తన ఇంట్లో 6 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో నలుగురు డాక్టర్లు. సమాజానికి బ్యాక్ బోన్ వంటి వృత్తుల్లో ఒకటైన డాక్టర్లను కరోనా వచ్చిందని చెప్పి క్వారంటైన్లో పడేయడం, బ్లాక్ లిస్టులో పెట్టడం ఇదంతా మంచిది కాదని చాలా తేలికగా వ్యాఖ్యానించారు సంజీవ్ కుమార్. చిత్రమైన విషయం ఏంటంటే.. ఈయన స్వతహాగా డాక్టరు. అయినా విషయాన్ని చాలా తేలికగా చెప్పేస్తున్నారు.

This post was last modified on April 26, 2020 8:29 pm

Share

Recent Posts

పెద్ది దర్శకుడికి పెద్ద హీరో దొరకట్లేదా

జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు…

1 hour ago

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

6 hours ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

8 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

11 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

12 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

13 hours ago