కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడింది. మనం ఊహించినదానికంటే ఎక్కువగా ఇండియాలో కరోనా ఉంది. 30-40 రోజుల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఇపుడు బయటపడుతున్నాయి. దీనిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం కరోనా కర్నూలులో నాలుగో దశలో ఉంది. నాకు తెలిసి దేశంలో కరోనా సుమారు 2 కోట్ల మందికి సోకి ఉంటుంది అని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సమస్య ఎక్కువ కావడం లేదు, సమస్య ప్రపంచమంతటా ఉంది.
మన వద్ద కూడా ఉంది. ఒక్కో కేసు వచ్చిన కొద్దీ చుట్టుపక్కల అందరికీ టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడుతోంది అని ఆయన చెబుతున్నారు. మొత్తం 130 కోట్ల మందికీ టెస్టులు చేస్తే కనీసం 2-3 కోట్ల మందికి పాజిటివ్ ఉంటుందని చాలా సింపుల్ గా చెప్పేశారు ఎంపీ సంజీవ్.
తన ఇంట్లో 6 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో నలుగురు డాక్టర్లు. సమాజానికి బ్యాక్ బోన్ వంటి వృత్తుల్లో ఒకటైన డాక్టర్లను కరోనా వచ్చిందని చెప్పి క్వారంటైన్లో పడేయడం, బ్లాక్ లిస్టులో పెట్టడం ఇదంతా మంచిది కాదని చాలా తేలికగా వ్యాఖ్యానించారు సంజీవ్ కుమార్. చిత్రమైన విషయం ఏంటంటే.. ఈయన స్వతహాగా డాక్టరు. అయినా విషయాన్ని చాలా తేలికగా చెప్పేస్తున్నారు.
This post was last modified on April 26, 2020 8:29 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…