తాను ఇప్పటిదాకా పని చేసిన హీరోల్లో అత్యంత అల్లరి వాళ్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లే అంటున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ సందర్భంగా వీళ్లిద్దరూ చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదని రాజమౌళి చెప్పాడు.
తారక్ అల్లరేంటో తనకు ముందు నుంచి తెలుసని.. ఇప్పుడు అతడి అల్లరి ఇంకా పెరిగిందని.. అతడికి రామ్ చరణ్ లాంటి మరో అల్లరోడు దొరకడంతో షూటింగ్ స్పాట్లో వీళ్లను మేనేజ్ చేయడం చాలా కష్టమవుతోందని జక్కన్న చెప్పాడు.
ఇద్దరిలో ముందుగా తారకే.. చరణ్ను కెలుకుతుంటాడని.. చరణ్ కూడా తర్వాత అందుకుంటాడని జక్కన్న చెప్పాడు. సెట్లో ఒకరికి సీరియస్గా ఏదైనా చెబుతుంటే.. ఇంకొకరు కామెడీ చేస్తుంటారని, నవ్వుతుంటారని.. వీళ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతోందని రాజమౌళి తెలిపాడు.
ఇక తన గత సినిమా ‘బాహుబలి’ విషయానికి వస్తే.. ప్రభాస్, రానా కూడా కొంత అల్లరి చేశారని.. కానీ వాళ్లు మరీ ఎక్కువ అల్లరి చేయడానికి అవకాశం లేకపోయిందని జక్కన్న వెల్లడించాడు. అది భారీ కాస్ట్యూమ్స్, మేకప్తో ముడిపడిన సినిమా కావడంతో ఎక్కువ అల్లరి చేస్తే, నవ్వితే అవి చెదిరిపోయేందుకు ఆస్కారం ఉండటంతో ఆ ఇద్దరూ ఎక్కువ సమయం కామ్గా ఉండాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపాడు. ఐతే షూటింగ్ ముగిశాక మాత్రం ప్రభాస్.. రానాను ఎక్కువగా కెలుకుతూ ఉండేవాడని ఆయన తెలిపాడు.
ప్రభాస్ బయటికి కామ్గా కనిపించినా బాగా అల్లరి వాడే అని రాజమౌళి తెలిపాడు. ఐతే ఆన్ సెట్స్, షూటింగ్ గ్యాప్లో ప్రధాన పాత్రధారులు ఎంత అల్లరి చేసినా.. సన్నివేశాలు చేసేటపుడు మాత్రం ఎంత సీరియస్గా పని చేస్తారన్నది రాజమౌళి సినిమాల్లో ఇంటెన్సిటీ చూస్తే అర్థమవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’లో కూడా ఆ ఇంటెన్సిటీకి ఏమాత్రం కొదవ లేదని ఇటీవలే రిలీజ్ చేసి సీతారామరాజు పాత్ర టీజర్తో స్పష్టమైంది.
This post was last modified on April 26, 2020 9:38 pm
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…