మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేతగా చెప్పబడే ముద్రగడ పద్మనాభం, ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు. భారీ జన సందోహం నడుమ, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ ప్లాన్ చేసుకున్నా, కాపు సామాజిక వర్గం ఆయన్ని లైట్ తీసుకుంది. దాంతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది.
ముద్రగడకి వైసీపీ ఎలాంటి ‘ఆఫర్’ ఇచ్చింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, చాలాకాలంగా ఆయన వైసీపీతోనే వున్నారు. ప్రత్యక్షంగా వైసీపీలో చేరకపోయినా, 2014 ఎన్నికల సమయం నుంచీ ఆయన వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారన్నది బహిరంగ రహస్యం.
అయితే, కాపు సామాజిక వర్గ ప్రముఖుడు కావడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాస్త ఆచి తూచి వ్యవహరించారు. ఓ దశలో జనసేనలోకి ముద్రగడ పద్మనాభంని ఆహ్వానించాలని కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అయితే, వైసీపీ కోవర్టుగా జనసేనలోకి ముద్రగడ వస్తే, జనసేన పార్టీకే నష్టమన్న కోణంలో పవన్ కళ్యాణ్ కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చింది.
జనసేనలో చేరి, కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాలనుకున్న ముద్రగడ పద్మనాభంకి, ఆ అవకాశం దొరక్కపోవడంతో, తనను ఇన్నాళ్ళూ వెనకుండి నడిపిస్తున్న వైసీపీలోకే వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు.
ఈ మొత్తం వ్యవహారంలో, జనసేన పార్టీ తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్నట్లయ్యింది. ముద్రగడ, వైసీపీలోకి చేరడం జనసేనకు లాభమే తప్ప, నష్టం లేదన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గంలో జరుగుతున్న చర్చ.
This post was last modified on March 16, 2024 11:21 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…