మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేతగా చెప్పబడే ముద్రగడ పద్మనాభం, ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు. భారీ జన సందోహం నడుమ, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ ప్లాన్ చేసుకున్నా, కాపు సామాజిక వర్గం ఆయన్ని లైట్ తీసుకుంది. దాంతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది.
ముద్రగడకి వైసీపీ ఎలాంటి ‘ఆఫర్’ ఇచ్చింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, చాలాకాలంగా ఆయన వైసీపీతోనే వున్నారు. ప్రత్యక్షంగా వైసీపీలో చేరకపోయినా, 2014 ఎన్నికల సమయం నుంచీ ఆయన వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారన్నది బహిరంగ రహస్యం.
అయితే, కాపు సామాజిక వర్గ ప్రముఖుడు కావడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాస్త ఆచి తూచి వ్యవహరించారు. ఓ దశలో జనసేనలోకి ముద్రగడ పద్మనాభంని ఆహ్వానించాలని కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అయితే, వైసీపీ కోవర్టుగా జనసేనలోకి ముద్రగడ వస్తే, జనసేన పార్టీకే నష్టమన్న కోణంలో పవన్ కళ్యాణ్ కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చింది.
జనసేనలో చేరి, కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాలనుకున్న ముద్రగడ పద్మనాభంకి, ఆ అవకాశం దొరక్కపోవడంతో, తనను ఇన్నాళ్ళూ వెనకుండి నడిపిస్తున్న వైసీపీలోకే వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు.
ఈ మొత్తం వ్యవహారంలో, జనసేన పార్టీ తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్నట్లయ్యింది. ముద్రగడ, వైసీపీలోకి చేరడం జనసేనకు లాభమే తప్ప, నష్టం లేదన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గంలో జరుగుతున్న చర్చ.
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
తెలుగు సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్లో సినిమా చూసే అవకాశం…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…