Political News

మ‌ళ్లీ మేమే.. దేశం కూడా ఇదే చెబుతోంది: మోడీ

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు కొంత స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ, ఫ‌లితం మాత్రం ఎప్పుడో నిర్ణ‌యం అయిపోయింది. మ‌ళ్లీ మేమేన‌ని ఈ దేశం మొత్తం చాటి చెబుతోంది. ఈ దేశ ప్ర‌జ‌లు మోడీని మ‌రోసారి ప్ర‌ధానిని చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ స‌య‌మంలో మ‌రెంతో దూరంలో లేదు అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. నాగ‌ర్ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నిర్వ‌హించిన విజ‌య సంక‌ల్ప స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడు తూ.. మ‌రికొద్ది సేప‌ట్లో ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంద‌ని, అయితే ఇప్ప‌టికే మ‌రోసారి మోడీ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని దేశ ప్ర‌జ‌లు నిర్ణ‌యించేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని, అప్ప‌ట్లోనూ తాను వ‌చ్చాన‌ని తెలిపారు.

బీఆర్ ఎస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను తాను స్ప‌ష్టంగా చూశాన‌ని మోడీ అన్నారు. ఈసారి ఎన్డీయే కూట‌మికి 400 సీట్లు రాబోతున్నాయ‌ని తెలిపారు. అదే గాలి తెలంగాణ‌లోనూ వీస్తోంద‌ని చెప్పారు. గ‌త ప‌దే ళ్ళలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్ర‌భుత్వం విశేషంగా కృషి చేసింద‌ని తెలిపారు. అయితే.. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడుగ‌డుగునా అడ్డుకున్నాయ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను ఈ రెండు పార్టీలు ధ్వంసం చేశాయ‌ని విమ‌ర్శంచారు.

మ‌ల్కాజిగిరిలో శుక్ర‌వారం రాత్రి నిర్వ‌హించిన రోడ్ షో అద్భుతంగా జ‌రిగింద‌ని, ప్ర‌జ‌ల నుంచి విశేష స్పం దన ల‌భించింద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ‌లో కూడా అబ్ కీబార్ 400 పార్ నినాద‌మే వినిపిస్తోంద‌ని చెప్పారు. తెలంగాణ‌ను గేట్ వే ఆఫ్ సౌత్‌గా అభివ‌ర్ణించారు. ఏడుద‌శాబ్దాల పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంద‌ని విమ‌ర్శించారు. అదే రీతిలో తెలంగాణ‌లో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కూడా ప్ర‌జ‌ల ఆస్తుల‌ను దోచుకుంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on March 16, 2024 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

1 hour ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

1 hour ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

2 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

2 hours ago

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

4 hours ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

5 hours ago