Political News

టార్గెట్ రోజా.. తెల్ల‌వారితే టికెట్ ప్ర‌క‌టిస్తార‌న‌గా..

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి రోజాకు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో తీవ్ర సెగ త‌గులుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్నాళ్లుగా ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ.. ఐదు మండ‌లాల్లోని ఒక‌ప్ప‌టి ఆమె అనుచ‌రులు తీవ్ర స్థాయిలో ఉద్య‌మం చేస్తున్నారు. తాజాగా వీరు మ‌రోసారి ఎలుగెత్తారు. తెల్ల‌వారితే టికెట్ ప్ర‌క‌టిస్తార‌ని అన‌గా వారు మ‌రింత రెచ్చిపోయారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు రోజాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అది కూడా తాడేప‌ల్లికి ప్ర‌త్యేక వాహ‌నాల్లో వ‌చ్చి.. త‌మ ఆవేద‌న‌ను ఆందోళ‌న‌ను స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి మొర‌పెట్టుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ ను వారు కోరారు. జగనన్న ముద్దు – రోజా వద్దు అని ప్లకార్డులు ప్రదర్శించారు. తాము సపోర్ట్ చేయడం వల్లే నగరి నుంచి రోజా రెండు సార్లు గెలిచారని ఆమె వ్యతిరేక వర్గీయులు అన్నారు. సొంత చరిష్మాతో రోజా గెలిచే పరిస్థితే లేదని చెప్పారు. ఆమె పేరు వింటేనే నియోజకవర్గంలోని కార్యకర్తలంతా నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. తామంతా సపోర్ట్ చేస్తేనే రోజా గెలిచారని చెప్పారు. ఒక వేళ రోజాకు టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతారని స‌జ్జ‌ల‌కు తేల్చి చెప్పారు. తాము కూడా ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.

కార్యకర్తలతో రోజా చాలా చులకనగా మాట్లాడతారని విమర్శించారు.  నగరి నియోజవర్గాన్ని రోజా, ఆయన సోదరులు దోచేశార ని ఆరోపించారు. తమ అనుచరులపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, వారిని ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. తమను జగన్ బుజ్జగించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రోజా వల్ల పార్టీకి ఎంతో నష్టం జరుగుతోందని అన్నారు. ఈ విషయాన్ని జగన్ గమనించాలని చెప్పారు. దీనిపై స‌జ్జ‌ల వారిని వారించే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. వారు వినిపించుకోక‌పోవ‌డంతో విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామ‌ని చెప్పారు.

తెల్ల‌వారితే జాబితా..
వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈ నెల 16(శ‌నివారం) వైసీపీ అభ్య‌ర్థుల పూర్తి జాబితాను విడుద‌ల చేసేం దుకు సీఎం జ‌గ‌న్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయ‌నే స్వ‌యంగా ఈ జాబితాను వెలువ‌రిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నా యి. ఈ నేప‌థ్యంలో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రోజాకు టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌త్యేక వాహ‌నాల్లో తాడేప‌ల్లికి వ‌చ్చిన న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. రోజాకు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

న‌ట‌రాజ‌న్‌… కింక‌ర్త‌వ్యం…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…

2 hours ago

పూజా హెగ్డేకు మరోసారి నిరాశ

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…

2 hours ago

లెజెండరీ దర్శకులు భారతీరాజా ఇక లేరు

ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…

4 hours ago

గంట వాన పడితే ఇదీ హైదరాబాద్ పరిస్తితి

వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…

5 hours ago

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

15 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

15 hours ago