Political News

ఏయే రాష్ట్రాల్లో ఎవ‌రిది పైచేయి.. తాజా స‌ర్వే!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరు పార్టీలూ చ‌మ‌టోడుస్తున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి రావాల‌ని ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యించుకుని దూసుకుపో తున్నారు. క‌నీసం ఇప్పుడైనా గెల‌వ‌క‌పోతే.. పార్టీనే పుట్టిమునుగుతుంద‌న్న ఆందోళ‌న‌లో కాంగ్రెస్ అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ విడుద‌ల కానుంది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీకి వారు ప‌ట్టం క‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే విష‌యాల‌పై ఏబీపీ-సీ ఓట‌రు ప్రీపోల్ స‌ర్వే నిర్వ‌హించింది. దీనిలో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందంటే..

ఉత్తరప్రదేశ్: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌. ఇక్క‌డ ఏకంగా 80 లోక్‌స‌భ‌సీట్లు ఉన్నాయి. ఇక్క‌ ఎవరికి మెజార్టీ వస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే సెంటిమెంటు కూడా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెరుగైన ఫలితాలు వస్తాయని స‌ర్వేలో తేలింది. మొత్తం 80 లోక్ సభ సీట్ల‌లో ఎన్డీఏ కూటమి 74 ఖాయ‌మ‌ని ప్ర‌జ‌లు తేల్చి చెప్పిన‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ(ఎస్పీ) కూట‌మికి 6 ద‌క్క‌నున్నాయ‌ని పేర్కొంది.

హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత ఉత్త‌రాది రాష్ట్రం. ఇక్క‌డ‌ 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అయితే ఈ నాలుగు సీట్లలోనూ బీజేపీదే గెలుప‌ని స‌ర్వే తెలిపింది. ఇక్క‌డ 65 శాతం మంది ప్రజలు మోడీనే కోరుకుంటున్న‌ట్టు స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిని గుండుగుత్త‌గా బీజేపీ త‌న ఖాతాలో వేసుకునే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. కాంగ్రెస్ కూటమి మూడు స్థానాలు.. బీజేపీ కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయ స‌ర్వేలో తేలింది.

కేరళ: మొత్తం 20 పార్ల‌మెంటు సీట్లు ఉంటే.. అందులో 20 సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెల్చుకోనుందని స‌ర్వే తెలిపింది. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచే చాన్స్ ఉందని తెలిపింది.

రాజస్థాన్: 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లోనూ బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని స‌ర్వే పేర్కొంది.

గుజరాత్: ఇది ప్రధాని మోడీ సొంత రాష్ట్రం. గత రెండు సార్లు ప్రజలు మోడీకి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఉన్న 26 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. మూడో సారి కూడా గుజరాత్ ప్రజలు సంపూర్ణంగా మోడీకే జై కొడుతున్న‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది. 26/26 బీజేపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయ‌ని పేర్కొంది.

తమిళనాడు: అధికార‌ డీఎంకే కూటమి తమిళనాడులోని 39 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని స‌ర్వే పేర్కొంది. ఈ సారి బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తోంది. డిపాజిట్లు కూడా క‌ష్ట‌మ‌ని స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పెళ్లి కాలేదు… పిల్లల కోసం హీరోయిన్ ఏం చేసింది?

బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న…

1 hour ago

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

2 hours ago

అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది  

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…

3 hours ago

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

3 hours ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

4 hours ago

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

4 hours ago