Political News

జగన్ ఓపెన్ చేసిన గేట్ ఏమైంది?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో మొన్న సీఎం జగన్ సభ ఎంతో ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నీళ్లు ఇచ్చుకోలేకపోయాడని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఎంతో చిత్తశుద్ధితో ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తోందని ఆయన ఘనంగా ప్రకటన చేశారు. ఈ పర్యటనలో జగన్ బటన్ నొక్కడం.. గేట్ నుంచి హంద్రీ నీవా నీళ్లు బయటికి రావడం తెలిసిందే. సంబంధిత వీడియోను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఐతే ఒక్క రోజు గడిచిందో లేదో.. జగన్ ఓపెన్ చేసిన గేటే అక్కడ లేకుండా మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ పర్యటన ముగిసిన తర్వాతి రోజు.. జేసీబీతో ఆ గేటును ఊడబీకించి అక్కడి నుంచి తరలించేయడం గమనార్హం.

కేవలం జగన్ పర్యటన కోసం తాత్కాలికంగా ఆ గేట్ ఏర్పాటు చేసి, కొంత మొత్తంలో నీళ్లు స్టోర్ చేయించి వాటిని బయటికి వదిలినట్లు స్పష్టమవుతోంది. ఆయన పర్యటన ముగియగానే అక్కడి నుంచి గేట్ తీయించేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతానికి వచ్చి ముందు రోజు నీళ్లు పారిన చోట కూర్చుని అక్కడ గేటు, నీళ్లు రెండూ లేని విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. వైసీపీ వాళ్లు వైరల్ చేసిన వీడియోను మించి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.

కుప్పం ప్రాంతానికి నీళ్లు ఇచ్చినట్లు బయటి వాళ్లను మభ్యపెట్టవచ్చు కానీ.. ముందు రోజున్న గేట్ ఇప్పుడు లేకపోవడం, నీళ్లు రాకపోవడం ఆ ప్రాంత ప్రజలకు తెలిసిపోతుంది కదా.. దీని వల్ల జగన్ ప్రభుత్వం మరింత అన్‌పాపులర్ అవుతుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. బాబు ప్రభుత్వంలో 80 శాతం పూర్తయిన హంద్రీ నీవా ప్రాజెక్టు పనులను మూడేళ్లకు పైగా ఆపించేసి, ఎన్నికల ముందు జగన్ సర్కారు స్టంట్లు చేస్తోందంటూ టీడీపీ మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

This post was last modified on February 28, 2024 5:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

1 minute ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago