Movie News

పాపం గౌతమ్ మీనన్

గౌతమ్ మీనన్.. మణిరత్నం తర్వాత తమిళంలో అంతటి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్. కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి యాక్షన్ సినిమాలను ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేశాడో.. చెలి, ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి ప్రేమకథలను అంత హృద్యంగా తీసి తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడతను.

ఐతే దర్శకుడిగా సినిమాలు తీసుకోవడానికి పరిమితం అయితే బాగానే ఉండేది. కానీ నిర్మాతగా మారి ఫాంటాన్ ఫిలిమ్స్ అనే సంస్థను పెట్టి పెద్ద తప్పు చేశాడు. కొన్ని సినిమాలకు సంబంధించిన ఫినాన్షియల్ ఇష్యూస్ ఆయన కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఒక దశలో ఆయన సినిమాలన్నీ డోలాయమానంలో పడిపోయాయి. వాటిలో ఒక్కోదాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ.. ‘ధృవనక్షత్రం’, ‘నరకాసురన్’ అనే రెండు చిత్రాలు మాత్రం ఎటూ కాకుండా పోయాయి.

ఇందులో విక్రమ్ హీరోగా నటించిన ‘ధృవనక్షత్రం’ను ఎలాగైనా రిలీజ్ చేయాలని కొన్ని నెలలుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు గౌతమ్. కానీ డేట్ ప్రకటించాక మళ్లీ మళ్లీ వాయిదా వేయడం అనివార్యం అవుతోంది. చివరగా నవంబరు 24న సినిమాను రిలీజ్ చేయడానికి గౌతమ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత తాను డైరెక్ట్ చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి ఈ చిత్రానికి మోక్షం కల్పించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు గౌతమ్. కానీ ఫలితం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు గౌతమ్. అది చూసి అయ్యో అనుకుంటున్నారు గౌతమ్‌ అభిమానులు.

“ఇది హార్ట్ బ్రేకింగ్‌గా అనిపిస్తోంది. సినిమా వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ ఇన్వెస్టర్లకు సమాధానం చెప్పాలి కాబట్టి ఉంటున్నా. మార్చి 1న నా సినిమా ‘జాషువా’ విడుదల కానుంది. ఆలోపే ‘ధృవనక్షత్రం’ను రిలీజ్ చేయాలని చూశాను. కానీ కుదరలేదు” అని ఆవేదన స్వరంతో చెప్పాడు గౌతమ్. ఇలాంటి గ్రేట్ డైరెక్టర్‌కు అలాంటి పరిస్థితి రావడం సినీ ప్రేమికులకు ఆవేదన కలిగిస్తోంది.

This post was last modified on February 28, 2024 5:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

2 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

2 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

3 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

4 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

4 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

5 hours ago