కెరీర్ ఆరంభం నుంచి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. మాంచి మాస్ సినిమాతో పరిచయం కాగల భారీ కటౌట్ ఉన్నప్పటికీ.. ‘ముకుంద’ లాంటి క్లాస్ మూవీతో అతను హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ డామినేషన్ ఉన్న ‘ఫిదా’లో నటించాడు. ‘ఎఫ్-2’ లాంటి కామెడీ మూవీలో భాగం అయ్యాడు. అలాగే అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఈ క్రమంలో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడ్డాడు.
ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్. ప్రతి సినిమానూ డబ్బు కోణంలోనే చూడకూడదని.. ప్రయోగాత్మక కథలు చేసేటపుడు పారితోషకం విషయంలో వెనక్కి తగ్గడానికి కూడా తాను వెనుకంజ వేయనని వరుణ్ తెలిపాడు.
‘అంతరిక్షం’ సినిమాకు తాను సగం రెమ్యూనరేషనే తీసుకున్న విషయాన్ని వరుణ్ వెల్లడించాడు. తనకు ఇవ్వాల్సిన దాంతో మిగతా సగం మొత్తాన్ని సినిమా కోసమే ఖర్చు చేయమని చెప్పానని.. దర్శకుడు, నిర్మాత అడగకపోయినా తనే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నానని వరుణ్ తెలిపాడు. తన సినిమాకు ఆర్థికంగా ఎక్కువ నష్టం వాటిల్లితే అసలు పారితోషకమే తీసుకోకుండా ఉండిపోవడానికి కూడా తాను సిద్ధమని.. కానీ అలాంటి సందర్భం రాదనుకుంటున్నానని.. వచ్చినా తట్టుకునే శక్తి తనకు ఉందని వరుణ్ తెలిపాడు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ తన కెరీర్లో అత్యంత కష్టపడి, తపనతో చేసిన సినిమా అని.. ఈ సినిమా కోసం తన పెళ్లి ముహూర్తం కూడా వాయిదా వేసుకున్నానని వరుణ్ వెల్లడించడం విశేషం. ఈ చిత్రం కోసం హిందీలో శిక్షణ తీసుకుని, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పానని.. కానీ యాస కుదరక తర్వాత వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పారని అతను తెలిపాడు. మార్చి 1న ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 28, 2024 2:16 pm
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…
ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలవడం…
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…