కెరీర్ ఆరంభం నుంచి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. మాంచి మాస్ సినిమాతో పరిచయం కాగల భారీ కటౌట్ ఉన్నప్పటికీ.. ‘ముకుంద’ లాంటి క్లాస్ మూవీతో అతను హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ డామినేషన్ ఉన్న ‘ఫిదా’లో నటించాడు. ‘ఎఫ్-2’ లాంటి కామెడీ మూవీలో భాగం అయ్యాడు. అలాగే అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఈ క్రమంలో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడ్డాడు.
ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్. ప్రతి సినిమానూ డబ్బు కోణంలోనే చూడకూడదని.. ప్రయోగాత్మక కథలు చేసేటపుడు పారితోషకం విషయంలో వెనక్కి తగ్గడానికి కూడా తాను వెనుకంజ వేయనని వరుణ్ తెలిపాడు.
‘అంతరిక్షం’ సినిమాకు తాను సగం రెమ్యూనరేషనే తీసుకున్న విషయాన్ని వరుణ్ వెల్లడించాడు. తనకు ఇవ్వాల్సిన దాంతో మిగతా సగం మొత్తాన్ని సినిమా కోసమే ఖర్చు చేయమని చెప్పానని.. దర్శకుడు, నిర్మాత అడగకపోయినా తనే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నానని వరుణ్ తెలిపాడు. తన సినిమాకు ఆర్థికంగా ఎక్కువ నష్టం వాటిల్లితే అసలు పారితోషకమే తీసుకోకుండా ఉండిపోవడానికి కూడా తాను సిద్ధమని.. కానీ అలాంటి సందర్భం రాదనుకుంటున్నానని.. వచ్చినా తట్టుకునే శక్తి తనకు ఉందని వరుణ్ తెలిపాడు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ తన కెరీర్లో అత్యంత కష్టపడి, తపనతో చేసిన సినిమా అని.. ఈ సినిమా కోసం తన పెళ్లి ముహూర్తం కూడా వాయిదా వేసుకున్నానని వరుణ్ వెల్లడించడం విశేషం. ఈ చిత్రం కోసం హిందీలో శిక్షణ తీసుకుని, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పానని.. కానీ యాస కుదరక తర్వాత వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పారని అతను తెలిపాడు. మార్చి 1న ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 28, 2024 2:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…