వైసీపీ కీలక నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సమన్వయ కర్త.. వైవీసుబ్బారెడ్డి వివాదాలకు నిలయంగా మారారనే టాక్ వినిపిస్తోంది. ఈయన పార్టీ ని ఏమేరకు డెవలప్ చేశారో తెలియదు కానీ, పార్టీని మాత్రం నిలువెత్తు వివాదాలలో కప్పెట్టారని అంటున్నారు వైసీపీ నేతలు. వరుస విమర్శలతో ఆయన వైసీపీని ఇరుకున పెడుతున్నారు. ఏపీకి మరో రెండేళ్లు హైదరాబాద్ నే రాజధానిగా కోరుకుంటున్నామని.. కేంద్రానికి ఈ మేరకు నివేదిక కూడా సీఎం జగన్ పంపిస్తున్నారని చెప్పారు.
ఇది పెద్ద రాజకీయ దుమారం రేపి.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మూడు రాజధానులు కట్టే పరిస్థితి, ఓపిక, వ్యూహం లేకనే ఇలా హైదరాబాద్ను మరోసారి రాజధానిగా కోరుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ఈ తీవ్రత పెరిగిందని గ్రహించిన పార్టీ అధిష్టానం చక్కదిదద్దుకునే చర్యలు చేపట్టి.. సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డిని రంగంలోకి దింపింది. ఆయన తమకు ఆ ఉద్దేశం లేదని.. ఏపీలోనే విశాఖను రాజధాని చేయాలన్న నిర్ణయానికి కట్టుబడ్డామని తేల్చి చెప్పారు.
ఇక, రెండో వివాదం.. పార్టీలో ఇటీవల నియమించిన సమన్వయకర్తలు అసలు అభ్యర్థులే కారని.. ఎన్నికలు వారం ముందు.. కొత్త జాబితా ఇస్తామని వారే అభ్యర్థులను వైవీ బాంబు పేల్చారు. దీంతో అప్పటి వరకు వివిధ నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలుగా బాధ్యతలు చేపట్టిన నాయకులు నిరుత్సాహంలో కూరుకుపోయారు. అప్పటి వరకు ఉత్సాహంగా పనిచేసిన నాయకులు.. ఇక, చతికిల పడ్డారు. చేతిలో ఉన్న రూపాయిలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఇది పెద్ద మైనస్గా మారిపోయింది.
ఇక, తాజాగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఏకంగా.. శ్రీకాకుళంలో సుబ్బారెడ్డి ఆస్తులు కాజేసేందుకు వచ్చారని తంతానని వార్నింగ్ ఇచ్చానని.. లేకపోతే.. ఇక్కడి భూములకు రక్షణ లేకుండా పోయేదని వ్యాఖ్యానించారు. ఇది మరింతగా డ్యామేజీ చేసింది. దీనిలో నిజం ఎంతో తెలియక పోయినా.. ప్రతిపక్ష నేతలకు ఆయుధాలు అందించేసినట్టు అయింది. వైసీపీకి ఓట్లేస్తే.. ఇక్కడి భూములు కొల్ల గొట్టేస్తారనే చర్చ తీవ్రంగా సాగుతోంది. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రచారం పార్టీకి మరింత ఇబ్బందిగా మారింది.
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…