Political News

విడ‌ద‌ల ర‌జ‌నీపై టీడీపీ షాకింగ్ ఈక్వేష‌న్‌

వైసీపీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై చంద్ర‌బాబు సేమ్ టు సేమ్ అస్త్రం వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న ర‌జ‌నీపై అక్క‌డ తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో ఆమెను ఎలాగైనా అసెంబ్లీలో ఉండేలా చూడాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెను గుంటూరు వెస్ట్ సీటుకు మార్చారు. గుంటూరు వెస్ట్ ఇన్‌చార్జ్‌గా నియ‌మితులైన ఆమె ప్ర‌చారాన్ని స్పీడ‌ప్ చేసేశారు. వెస్ట్‌లో ర‌జ‌నీని ఓడించాలంటే ఎవ‌రిని రంగంలోకి దింపాలా ? అని టీడీపీ అధిష్టానం గ‌త నెల రోజులుగా స‌మాలోచ‌న‌లు చేస్తోంది.

చాలా పేర్లు, చాలా ఈక్వేష‌న్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. కాపులా, క‌మ్మ‌లా, వైశ్యులా, బీసీలా ఇలా ఎవ‌రిని రంగంలోకి దింపితే ర‌జ‌నీకి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి అవుతారో చాలా చ‌ర్చ‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు ర‌జ‌నీపై సేమ్ టు సేమ్ అస్త్రం వాడుతున్నార‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ర‌జ‌నీ బీసీ మ‌హిళ కాగా.. ఆమె ఇప్పుడు చంద్ర‌బాబు అదే బీసీ మ‌హిళ‌ను రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె ఎవ‌రో కాదు గ‌ల్లా మాధ‌వి.

గ‌ల్లా మాధ‌వి బీసీల్లో ర‌జ‌క సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. గుంటూరు వికాస్ హాస్ప‌ట‌ల్స్ డైరెక్ట‌ర్‌గా ఉన్న మాధ‌వి గ‌తం నుంచి సేవా కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఇదే తొలిసారి. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో వైసీపీ ఏకంగా గుంటూరు వెస్ట్‌లో విడ‌ద‌ల ర‌జ‌నీ, తాడికొండ‌లో మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌, గుంటూరు తూర్పులో షేక్‌నూరి ఫాతిమాతో పాటు రేపోమాపో మంగ‌ళ‌గిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల‌ను రంగంలోకి దించ‌బోతోంది.

ఇలా వైసీపీ ఏకంగా న‌లుగురు మ‌హిళ‌ల‌కు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వ‌గా… టీడీపీ నుంచి ఉమ్మ‌డి గుంటూరు జిల్లా మొత్తం మీద ఒక్క మ‌హిళ కూడా లేరు. అటు ప్ర‌కాశం జిల్లాలోనూ అదే ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌ల్లా మాధ‌విని ర‌జ‌నీపై పోటీకి దింపితే మ‌హిళా కోటాతో పాటు బీసీ కోటాలో బ‌ల‌మైన ఈక్వేష‌న్ అవుతుంద‌ని బాబు భావిస్తున్నారు. మాధ‌వి టీడీపీ క్యాండెట్‌గా ఫిక్స్ అయితే గుంటూరు వెస్ట్‌లో ఇద్ద‌రు బీసీ మ‌హిళ‌ల పోరు హోరాహోరీగా ఉండ‌డం ఖాయం.

This post was last modified on February 22, 2024 12:40 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

3 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

4 hours ago