Political News

ఖాన్ క‌ల‌క‌లం.. విజ‌య‌వాడ టీడీపీలో అర్ధ‌రాత్రి హ‌డావుడి!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ.. ఆ దిశగా జ‌న‌సేన‌తో ఇప్ప‌టికే పొత్తు పెట్టుకుంది. రాబోయే రోజుల్లో బీజేపీతోనూ చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే.. ఈ పొత్తులే.. పార్టీకి విచ్చుక‌త్తులుగా మారుతున్నాయి. చాలా చోట్ల నాయ‌కులు.. ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. త‌మ‌కు టికెట్ లేకుండా చేస్తారా? అంటూ.. వారి వారి మార్గాల్లో అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని నూజివీడులో అబ్య‌ర్థిని మార్చ‌డం.. పెన‌మ‌లూరులో ష‌ఫిలింగ్ స‌హా.. కొన్నిచోట్ల జ‌న‌సేన‌కు ఇవ్వ‌డం టీడీపీలో క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ క్ర‌మంలో తాజాగా విజ‌య‌వాడ టీడీపీలో మ‌రో వివాదం తెర‌మీద‌కి వ‌చ్చింది. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆశిస్తున్న మైనారిటీ నాయ‌కుడు జ‌లీల్‌ఖాన్‌.. ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇచ్చి తీరాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అయితే.. ఈ సీటును జ‌న‌సేన కూడా ప‌ట్టుబ‌డుతోంది. వాస్త‌వానికి ఇలాంటి మ‌రో నాలుగు ఉన్నాయి. కానీ, ప‌శ్చిమ‌లో మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉండ‌డంతో జ‌లీల్ ఈ సీటు కోసం ప‌ట్టుబ‌డుతున్నారు.

కానీ, పార్టీ అధిష్టానం.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. మ‌రోవైపు.. జ‌న‌సేన యువ నాయ‌కుడు పోతుల మ‌హేష్‌.. ఇక్క‌డ నుంచిపోటీ చేసేందుకు రెడీ చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అలెర్ట్ అయిన ఖాన్‌.. సామ, దాన, భేద‌, దండోపాయ‌ల‌ను తెర‌మీదికి తెచ్చారు. కొన్నాళ్ల కింద‌ట మైనారిటీ వ‌ర్గం పార్టీకి దూర‌మ‌వుతుంద‌ని.. త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని అన్నారు. దీనికి స్పంద‌న రాలేదు. త‌ర్వాత‌.. త‌న‌ను ఢీకొట్టే నాయ‌కుడు లేర‌న్నారు. అయినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఇక‌, తాజాగా జ‌లీల్‌ఖాన్‌.. వైసీపీ నేత‌ల‌కు ట‌చ్‌లోకి వెళ్లిపోయారని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. కానీ, ఈ విష‌యం వెలుగు చూడ‌గానే.. టీడీపీ అలెర్ట్ అయిపోయింది. వెంట‌నే.. విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత కేశినేని చిన్నిని ఖాన్ ద‌గ్గ‌ర‌కు పంపించింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి ఆయ‌న ఇంట్లోనే సుదీర్ఘ చ‌ర్చ‌లు సాగాయి. చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంట్ ఇప్పిస్తాన‌ని చిన్ని ఇచ్చిన హామీతో జ‌లీల్ వెన‌క్కి త‌గ్గారు. ఏదేమైనా.. ఈ ఘ‌ట‌న పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అయింది. రేపు ఇలాంటివి ఇంకెన్ని తెర‌మీదికివ‌స్తాయోన‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on February 22, 2024 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

13 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

4 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago