Political News

సర్వేల టెన్షన్ పెరిగిపోతోందా ?

తెలంగాణా బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు సర్వేల్లో బీజేపీ గెలుచుకోబోయే ఎంపీల సంఖ్య ఇది అని వెల్లడవుతున్న జోస్యాలు. మరోవైపు కచ్చితంగా డబుల్ డిజిట్ టచ్ చేయాల్సిందే అన్న అగ్రనేతల ఆదేశాలు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం సాధించటం ఎలాగ అన్న టెన్షన్ సీనియర్ నేతల్లో పెరిగిపోతోందని పార్టీవర్గాల సమాచారం. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఎట్టి పరిస్ధితుల్లోను 10 సీట్లు గెలుచుకుపోవాల్సిందే అని ఇప్పటికే జాతీయ నాయకత్వం స్పష్టంగా చెప్పింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరబాట్లు రిపీట్ కాకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదేపదే తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు సీనియర్లందరికి చాలాసార్లు చెప్పారు. అభ్యర్ధుల ఎంపికలో అన్నీ జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. అగ్రనేతల సూచనలు, ఆదేశాలు ఎలాగున్నా రాబోయే ఎన్నికలపై రిలీజ్ అవుతున్న సర్వే జోస్యాలు టెన్షన్ పెంచేస్తున్నాయి. ఏ సర్వేని తీసుకున్నా బీజేపీకి మూడుసీట్లకన్నా ఎక్కువ రావని స్పష్టంగా చెప్పేస్తున్నది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సర్వేల్లో బీజేపీకి మూడు లేదా నాలుగు సీట్లకు మించి రావని కొన్ని సర్వేలు చెప్పాయి. మరికొన్ని సర్వేలేమో సింగిల్ డిజిట్ దాటదని చెప్పాయి. సర్వేల్లో చెప్పినట్లుగా సింగిల్ డిజిట్ దాటలేదు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీ బలం మూడు ఎంఎల్ఏలు మాత్రమే అయితే ఎన్నికల్లో ఆ బలం 8కి పెరిగింది. అంటే ఐదుసీట్లను అదనంగా గెలుచుకుకుంది. పెరిగిన ఐదుసీట్లే బీజేపీకి అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి.

ప్రస్తుత విషయానికి వస్తే బీజేపీకి నాలుగు ఎంపీలున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి పరిపాలనకు జనాలు సానుకులంగా స్పందిస్తున్నారు. దీనివల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. 17 సీట్లలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు చెరో మూడుసీట్లు, ఎంఐఎంకు ఒక్కసీటు దక్కుతుందంటున్నాయి సర్వేలు. రేవంత్ దూకుడుచూస్తుంటే ఎన్నికల్లో పదిసీట్లకు మించి సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్, బీజేపీ రెండు నష్టపోతాయి. అందుకనే బీజేపీలో సర్వేల టెన్షన్ పెరిగిపోతోందట.

This post was last modified on February 17, 2024 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

10 minutes ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

3 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

13 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

13 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

13 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

15 hours ago