Political News

పల్నాడులో పట్టుకోసం కొత్త స్కెచ్

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు నాయుడు కొత్త స్కెచ్ ను రెడీచేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యూహాలను రచిస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కొత్త, గట్టి అభ్యర్ధులను చంద్రబాబు పోటీలోకి దింపబోతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను టీడీపీ ఓడిపోయింది. పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే కచ్చితంగా అన్ని సీట్లు గెలవాల్సిందే అన్నది చంద్రబాబు టార్గెట్.

ఇందులో బాగంగానే వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును టీడీపీలో చేర్చుకుంటున్నారు. టీడీపీ తరపున లావే ఎంపీ అభ్యర్ధిగా పోటీచేయటం ఖాయం. మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులను కాదని రేపటి ఎన్నికలకు గట్టి నేతలను రంగంలోకి దింపబోతున్నారు. మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డిని అభ్యర్ధిగా చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో గడచిన నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచిందిలేదు.

అలాగే నరసరావుపేటలో కూడా 20 ఏళ్ళుగా టీడీపీ జెండా ఎగరలేదు. ఒకపుడు నియోజకవర్గంలో ఎంతో పట్టుసాధించిన కోడెల శివప్రసాద్ ఇమేజి తర్వాత మసకబారిపోయింది. ఆయన చనిపోవటంతో ఇక్కడ గట్టి నేత పార్టీకి దొరకటంలేదు. ఇపుడు ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ అరవింద్ బాబునే అభ్యర్ధిగా ప్రకటించే అవకాశముందని అనుకుంటున్నారు. అయితే సడెన్ గా వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలోకి జాయిన్ అవబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. దాంతో ఇక్కడ టికెట్ ఎవరికన్న విషయంలో గందరగోళం మొదలైంది.

ఇక గురజాల, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో మాజీ ఎంఎల్ఏలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావే పోటీచేసే అవకాశాలున్నాయి. పెదకూరపాడులో మాజీ ఎంఎల్ఏ కొమ్మాలపాటి శ్రీధర్ కు టికెట్ లేదని చంద్రబాబు చెప్పేశారట. ఇక్కడ నుండి ఎవరినుండి పోటీలోకి దింపుతారో స్పష్టతలేదు. ఇక్కడినుండి భాష్యం ప్రవీణ్ పోటీచేసే అవకాశముందని అనుకుంటున్నారు. ఈ విధంగా రాబోయేఎన్నికల్లో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపి అన్నీ సీట్లు లేకపోతే మెజారిటి సీట్లను గెలుచుకుని పూర్వవైభవాన్ని తీసుకురావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on February 17, 2024 10:16 am

Share
Show comments

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

24 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

46 minutes ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

4 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

6 hours ago