ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అయితే… ఇక్కడ ఓడౌట్ రావొచ్చు. బుధవారమే.. పార్టీ నాయకులతో మాట్లాడిన చంద్ర బాబు, ఇక, వైసీపీ నేతలను చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు.. చాలా మంది టచ్లో ఉన్నారని.. కానీ, వారిలో కొందరికి మాత్రమే అవకాశం ఇస్తామని తేల్చి చెప్పారు. ఇలా.. ఆ కొందరితోనే తాజాగా చంద్రబాబు భేటీ అయ్యారు. వీరు కూడా ఎక్కువ మందే ఉండడం గమనార్హం.
టీడీపీలో టికెట్ల వ్యవహారం ఇప్పటికే కన్ఫ్యూజన్గా మారింది. దీంతో కొత్త వారిని చేర్చుకుంటే ఇబ్బందులు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని చంద్రబాబు కూడా గమనించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త వారికి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. అయితే.. ఇప్పటికే మాట ఇచ్చిన వారిని తాజాగా ఉండవల్లి లోని తన ఇంటికి ఆహ్వానించిన చంద్రబాబు.. వారితో చర్చలు జరుపుతున్నారు. వీరిలో నరసరావుపేట ఎంపీ.. వైసీపీ నాయకుడు(ఇటీవల రాజీనామా చేశారు) లావు శ్రీకృష్ణదేవరాయులు.. ఉన్నారు.
చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తాజాగా భేటీ అయ్యారు. టీడీపీలో చేరితే ఆయనకు సిట్టింగ్ పేట టికెట్ కన్ఫర్మ్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. నరసరావుపేట పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల విజయాన్ని కూడా ఈయన భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్నిపార్టీల్లోనూ ఉన్న విషయమే. దీనికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం.
మరోవైపు.. వైసీపీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి కూడా.. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. దాదాపు 100 కార్ల భారీ కాన్వాయ్తో వచ్చారు. ఈయన పార్టీలో టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చినా గెలిచి గిఫ్ట్గా ఇస్తామని చెబుతున్నారు.
నూజివీడుపై స్పెషల్ ఫోకస్..
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నూజివీడులో అభ్యర్థి మార్పు ఖరారైన దరిమిలా.. ఇక్కడి టికెట్ ను ఆశించిన టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావును కూడా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సారికి పార్టీకి సహకరించాలని.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీనికి ముద్దరబోయిన ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక్కడ నుంచి వైసీపీ నాయకుడు.. ప్రస్తుత పెనమలూరు ఎమ్మెల్యే కొలుసూఉ పార్థసారథిని పార్టీ దాదాపు ఖరారు చేసింది.
This post was last modified on February 16, 2024 1:45 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…