Political News

టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌.. క్యూ క‌ట్టిన వైసీపీ నేత‌లు

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో వైసీపీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునే కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రం చేసింది. అయితే… ఇక్క‌డ ఓడౌట్ రావొచ్చు. బుధ‌వారమే.. పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడిన చంద్ర బాబు, ఇక‌, వైసీపీ నేత‌ల‌ను చేర్చుకునేది లేద‌ని తెగేసి చెప్పారు. అంతేకాదు.. చాలా మంది ట‌చ్‌లో ఉన్నార‌ని.. కానీ, వారిలో కొంద‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఇస్తామ‌ని తేల్చి చెప్పారు. ఇలా.. ఆ కొంద‌రితోనే తాజాగా చంద్ర‌బాబు భేటీ అయ్యారు. వీరు కూడా ఎక్కువ మందే ఉండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీలో టికెట్ల వ్య‌వ‌హారం ఇప్ప‌టికే క‌న్ఫ్యూజ‌న్‌గా మారింది. దీంతో కొత్త వారిని చేర్చుకుంటే ఇబ్బందులు మ‌రింత‌గా పెరిగే ఛాన్స్ ఉంద‌ని చంద్ర‌బాబు కూడా గ‌మ‌నించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కొత్త వారికి అవ‌కాశం ఇవ్వరాద‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇప్ప‌టికే మాట ఇచ్చిన వారిని తాజాగా ఉండ‌వల్లి లోని తన ఇంటికి ఆహ్వానించిన చంద్ర‌బాబు.. వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. వీరిలో న‌ర‌స‌రావుపేట ఎంపీ.. వైసీపీ నాయకుడు(ఇటీవ‌ల రాజీనామా చేశారు) లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు.. ఉన్నారు.

చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తాజాగా భేటీ అయ్యారు. టీడీపీలో చేరితే ఆయ‌నకు సిట్టింగ్ పేట టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో క‌లిసి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. న‌ర‌స‌రావుపేట ప‌రిధిలోకి వ‌చ్చే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల విజ‌యాన్ని కూడా ఈయ‌న భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్నిపార్టీల్లోనూ ఉన్న విష‌య‌మే. దీనికి చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు.. వైసీపీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి కూడా.. చంద్ర‌బాబు నివాసానికి చేరుకున్నారు. దాదాపు 100 కార్ల భారీ కాన్వాయ్‌తో వ‌చ్చారు. ఈయ‌న పార్టీలో టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇచ్చినా గెలిచి గిఫ్ట్‌గా ఇస్తామ‌ని చెబుతున్నారు.

నూజివీడుపై స్పెష‌ల్ ఫోక‌స్‌..

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నూజివీడులో అభ్య‌ర్థి మార్పు ఖ‌రారైన ద‌రిమిలా.. ఇక్క‌డి టికెట్ ను ఆశించిన టీడీపీ ఇన్‌చార్జి ముద్ద‌ర‌బోయిన వెంకటేశ్వరరావును కూడా చంద్ర‌బాబు ఆహ్వానించారు. ఈ సారికి పార్టీకి స‌హ‌క‌రించాల‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. దీనికి ముద్ద‌ర‌బోయిన ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కుడు.. ప్ర‌స్తుత పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసూఉ పార్థ‌సార‌థిని పార్టీ దాదాపు ఖ‌రారు చేసింది.

Satya

Recent Posts

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

3 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

5 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

7 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

8 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

8 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

9 hours ago