ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయట పెట్టేశారు. దేశంలో ఏం జరగాలని బీజేపీ కోరుకుంటోందో.. ఏం జరగాలని హిందూత్వ వాదులు కోరుతున్నారో.. ఆయన చెప్పకనే చెప్పారు. బుధవారం యూపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. “ఔను.. బీజేపీ వ్యూహం సరిగా అర్ధం కానట్టు లేదు. మీకు( మాజీ సీఎం అఖిలేష్ యాదవ్) మా వ్యూహాలు అర్ధం కాకపోవడమే మంచిది. అదే మేం కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానిస్తూనే.. దేశంలో బీజేపీ ఏం చేయాలని అనుకుంటోందో ఆయన చెప్పారు.
“మేం మూడు ప్రాంతాలను కోరుకుంటున్నాం. అయోధ్య… ఇప్పటికే సాధించాం. ఇక, కాశీ, మధురలు మిగిలాయి. మళ్లీ బీజేపీ నే వస్తుంది. వాటిని కూడా సాధిస్తుంది” అని సీఎం యోగి చెప్పేశారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ మసీదులు ఉండడం, ముస్లింలు పవిత్ర ప్రాంతాలుగా భావిస్తున్న విషయం తెలిసిందే. అయోధ్యలో ఇప్పటికే రామమందిరం నిర్మించేశారు. దీనిని ప్రపంచ వ్యాప్త పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మార్చుతున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఇక, ఇప్పుడు కాశీలోని జ్ఞానవాపీ మసీదు ప్రాంతంలో హిందే ఆలయాలు ఉన్నాయనే విషయం వెలుగు చూడడం.. అక్కడ పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతులు కూడా ఇచ్చారు.
ఇక, మిగిలింది మధుర. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థానం. అయితే.. ఇక్కడ కూడా.. మసీదు ఉంది. ఇప్పుడు దీనిపైనే బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. అయితే.. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. తమ అజెండాలో దీనిని చేర్చడం ఖాయమనే వాదన ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి యూపీలో 80 స్థానాలను కైవసం చేసుకుంటామని..ఈ మూడు ప్రాంతాలను తాము అజెండాలో చేర్చుకుంటామని తాజాగా సీఎం యోగి ప్రకటించడం చూస్తే.. మోడీ వ్యూహాన్ని ఆయన చెప్పేసినట్టు అయింది.
‘సనాతన ధర్మం ఆచరించే వారంతా అయోధ్యలో రామాలయం నిర్మాణంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ శతాబ్దంలోనే ఇంతపెద్ద ఈవెంట్ జరిగితే విపక్షాలు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ అయోధ్యలోని సరికొత్త, భవ్య రామాలయాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఈపని ఎప్పుడో జరగాల్సింది’ అని యోగి చెప్పడం గమనార్హం.
This post was last modified on February 7, 2024 7:33 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…