Political News

మోడీ వ్యూహాన్ని బ‌య‌ట పెట్టేసిన ముఖ్య‌మంత్రి!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ్యూహాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ బ‌య‌ట పెట్టేశారు. దేశంలో ఏం జ‌ర‌గాల‌ని బీజేపీ కోరుకుంటోందో.. ఏం జ‌ర‌గాల‌ని హిందూత్వ వాదులు కోరుతున్నారో.. ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. బుధ‌వారం యూపీ అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. “ఔను.. బీజేపీ వ్యూహం స‌రిగా అర్ధం కాన‌ట్టు లేదు. మీకు( మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌) మా వ్యూహాలు అర్ధం కాక‌పోవ‌డ‌మే మంచిది. అదే మేం కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానిస్తూనే.. దేశంలో బీజేపీ ఏం చేయాల‌ని అనుకుంటోందో ఆయ‌న చెప్పారు.

“మేం మూడు ప్రాంతాల‌ను కోరుకుంటున్నాం. అయోధ్య‌… ఇప్ప‌టికే సాధించాం. ఇక‌, కాశీ, మ‌ధుర‌లు మిగిలాయి. మ‌ళ్లీ బీజేపీ నే వ‌స్తుంది. వాటిని కూడా సాధిస్తుంది” అని సీఎం యోగి చెప్పేశారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ మ‌సీదులు ఉండ‌డం, ముస్లింలు ప‌విత్ర ప్రాంతాలుగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. అయోధ్య‌లో ఇప్ప‌టికే రామ‌మందిరం నిర్మించేశారు. దీనిని ప్ర‌పంచ వ్యాప్త ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మార్చుతున్నట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు కాశీలోని జ్ఞాన‌వాపీ మ‌సీదు ప్రాంతంలో హిందే ఆల‌యాలు ఉన్నాయ‌నే విష‌యం వెలుగు చూడ‌డం.. అక్క‌డ‌ పూజ‌లు చేసుకునేందుకు హిందువులకు అనుమ‌తులు కూడా ఇచ్చారు.

ఇక‌, మిగిలింది మ‌ధుర‌. ఇది శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థానం. అయితే.. ఇక్క‌డ కూడా.. మ‌సీదు ఉంది. ఇప్పుడు దీనిపైనే బీజేపీ దృష్టి కేంద్రీక‌రించింది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. త‌మ అజెండాలో దీనిని చేర్చ‌డం ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి యూపీలో 80 స్థానాల‌ను కైవసం చేసుకుంటామ‌ని..ఈ మూడు ప్రాంతాల‌ను తాము అజెండాలో చేర్చుకుంటామ‌ని తాజాగా సీఎం యోగి ప్ర‌క‌టించ‌డం చూస్తే.. మోడీ వ్యూహాన్ని ఆయ‌న చెప్పేసిన‌ట్టు అయింది.

‘సనాతన ధర్మం ఆచరించే వారంతా అయోధ్యలో రామాలయం నిర్మాణంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ శతాబ్దంలోనే ఇంతపెద్ద ఈవెంట్‌ జరిగితే విపక్షాలు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ అయోధ్యలోని సరికొత్త, భవ్య రామాలయాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఈపని ఎప్పుడో జరగాల్సింది’ అని యోగి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 7, 2024 7:33 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

4 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

6 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

7 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

7 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

7 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

7 hours ago