వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని రెండోసారి కూడా అధికారంలోకి రావాలని బావిస్తున్న వైసీపీలో అంతర్గత విభేదాలు.. ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్సీ ఓటు బ్యాంకు తమకే అనుకూలంగా ఉందని చెబుతున్న వైసీపీలో ఆ ఎస్సీ నేతలే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో తమకు అవమానాలు తప్పడం లేదని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేసిన వారు కూడా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు.
“దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. వారికి అవమానాలు తప్పడం లేదు.” అని వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పార్టీలో దళితులపై అవమానాలు సహజమైపోయాయంటూ మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. పార్టీలో ఎస్సీలకు వాల్యూ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓలేఖను పార్టీకి ఆయన పంపించారు.
ఏం జరిగింది?
మడకశిర నియోజకవర్గంలో ఇటీవల ఎమ్మెల్యే తిప్పేస్వామిని పక్కన పెట్టి.. వేరే వారికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఒంటెత్తు పోకడలు పోతున్నారనేది తిప్పేస్వామి ఆవేదన. మరో రెండు నెలల పాటు తాను ఎమ్మెల్యేగా ఉంటానని.. అయినప్పటికీ.. తనకు కనీస మర్యాద, ప్రొటోకాల్ ప్రకారం గౌరవం కూడా ఇవ్వడం లేదని తిప్పేస్వామి అంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అయిన తిప్పేస్వామిని పిలవలేదు. పిలిచినా.. చివరి నిముషంలో సమాచారం ఇచ్చారు.
దీనిపై తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నియోజకవర్గ ఇంచార్జ్ అశోక్ కుమార్కు లేఖ రాశారు. దురు ద్దేశంతోనే సమావేశానికి తాను రాకుండా చేశారని, ఎస్సీనైనన్ను పట్టించుకోకపోవడం మనసును గాయపరిచిందని పేర్కొన్నారు. దళిత వర్గానికి ఎలాంటి సందేశాన్ని పంపించాలని అనుకున్నారో చెప్పండని ప్రశ్నించారు. ఇది దళితులని అవమానించడం కాదా..! ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా అని తిప్పేస్వామి నిలదీశౄరు. దళితలైన మేము ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానం భరించడం సహజమే అని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 28, 2024 3:13 pm
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…