Political News

రాజ‌కీయాల్లో ఉంటూ మౌనం పాటించ‌లేను: గ‌ల్లా గుడ్ బై

టీడీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన పార్టీ కేడ‌ర్ ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని.. త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు, వ్యాపారం రెండూ తాను కొన‌సాగించ‌లేక పోతున్న‌ట్టు చెప్పారు. రాజ‌కీయాల్లో నిజాయితీగా ఉంటే.. నోరు మూసుకుని మౌనంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు అయితే..తాను మౌనంగా చూస్తూ కూర్చోలేన‌ని చెప్పారు.

దీంతో త‌న వ్యాపారాల‌ను టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితి వ‌స్తోంద‌ని, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని, వ‌చ్చాయ‌ని ఆయ‌న చెప్పారు. పైగా వ్యాపారాల‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్ట‌లేక పోతున్న‌ట్టు గ‌ల్లా వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలోనే త‌న రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. “గుంటూరు ప్ర‌జ‌లు న‌న్ను ఆద‌రించారు. ఇక్క‌డ నుంచి మ‌రోసారి కూడా గెలిపించేందుకు వారు సిద్దంగానే ఉన్నారు. కానీ, నేను రాజ‌కీయాల్లో ఉంటే.. వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయి. అందుకే త‌ప్పుకొంటున్నా” అని గ‌ల్లా వ్యాఖ్యానించారు.

ప్రస్తుత రాజకీయాల పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన గ‌ల్లా.. ప్ర‌భుత్వంపై పోరాడితే.. వ్య‌క్తిగ‌తంగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో తెగువ ప్ర‌ద‌ర్శించిన‌ట్టు చెప్పారు. ఇటు రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటూనే అటు పార్ల‌మెంటులోనూ నిల‌దీశాన‌ని, త‌ర్వాత‌.. ఇది త‌న వ్యాపారాల‌పై ఎఫెక్ట్ చూపించింద‌ని అన్నారు. పార్లమెంట్ లో 24% వ్యాపారవేత్తలు ఉన్నారని, వారంతా కూడా.. మౌనంగా ఉంటార‌ని.. కానీ, తాను మాత్రం మౌనంగా ఉండ‌లేన‌ని గ‌ల్లా వ్యాఖ్యానించారు.

నిజాయితీ ప‌రులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి పార్లమెంట్ లో సైలెంట్ గా కూర్చోవడం త‌న‌ వల్ల కాదన్నారు. “2024 ఎన్నికల్లో పోటీ చేయను. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ గా ఉండలేను కాబట్టి వ్యాపారులు చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతాను. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తిరిగి రాజకీయాల్లోకి వస్తాను.” అని గ‌ల్లా అన్నారు.

బిజినెస్ పార్ట్ టైమ్ గా చెయ్యొచ్చు కానీ.. రాజకీయాలు అలా చేయ‌లేమ‌ని, ఫుల్‌టైమ్ దానికి ఇవ్వాల్సిందే న‌ని గ‌ల్లా అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో తాను ఫుల్ టైం దానికి కేటాయించ‌లేన‌న్నారు. వ్యాపారం అయినా, రాజకీయాలు అయినా దేశం కోసం మాత్రమే చేస్తానని చెప్పారు. వ‌చ్చే ఎన్నికల్లో త‌మ కుటుంబం పూర్తిగా రాజ‌కీయాలకు దూరంగా ఉంటుంద‌ని చెప్పారు.

This post was last modified on January 28, 2024 2:37 pm

Share

Recent Posts

వైసీపీ ఎత్తుగ‌డ‌: బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా…?

కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ క‌య్యానికి సుముఖంగా లేమ‌ని వైసీపీ స్ప‌ష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…

1 hour ago

సీనియర్లను ట్రోల్ చేస్తే ఎవరికి ప్రయోజనం

ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…

3 hours ago

అసలైన అనిరుధ్ బయటికి వచ్చాడు

గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…

3 hours ago

ఇప్పటికీ సచినే నెంబర్ వన్

సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…

7 hours ago

నోరు అదుపులో పెట్టుకోక‌పోతే… కోడిగుడ్లే ప‌డ‌తాయి: సుప్రీంకోర్టు

``దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చేందుకు మ‌న వాళ్లు తుపాకీ తూటాల‌కే వెనుకాడ‌లేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్ల‌కు భ‌య‌ప‌డ‌తారా?``అంటూ.. తృణ‌మూల్…

7 hours ago

`టార్గెట్ లోకేష్‌`… సింప‌తీ రాదు జ‌గ‌న్‌… !

ప్ర‌స్తుతం వైసీపీ పెట్టుకున్న ల‌క్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించ‌డం. గ‌త వారం రోజులుగా ఈ విష‌యాన్ని…

9 hours ago