టీడీపీ పార్లమెంటు సభ్యుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన పార్టీ కేడర్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని.. తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజకీయాలు, వ్యాపారం రెండూ తాను కొనసాగించలేక పోతున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉంటే.. నోరు మూసుకుని మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు అయితే..తాను మౌనంగా చూస్తూ కూర్చోలేనని చెప్పారు.
దీంతో తన వ్యాపారాలను టార్గెట్ చేస్తున్న పరిస్థితి వస్తోందని, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు వస్తున్నాయని, వచ్చాయని ఆయన చెప్పారు. పైగా వ్యాపారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నట్టు గల్లా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తన రాజకీయాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. “గుంటూరు ప్రజలు నన్ను ఆదరించారు. ఇక్కడ నుంచి మరోసారి కూడా గెలిపించేందుకు వారు సిద్దంగానే ఉన్నారు. కానీ, నేను రాజకీయాల్లో ఉంటే.. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అందుకే తప్పుకొంటున్నా” అని గల్లా వ్యాఖ్యానించారు.
ప్రస్తుత రాజకీయాల పై అసంతృప్తి వ్యక్తం చేసిన గల్లా.. ప్రభుత్వంపై పోరాడితే.. వ్యక్తిగతంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ రాజధాని అమరావతి విషయంలో తెగువ ప్రదర్శించినట్టు చెప్పారు. ఇటు రైతులకు మద్దతుగా ఉంటూనే అటు పార్లమెంటులోనూ నిలదీశానని, తర్వాత.. ఇది తన వ్యాపారాలపై ఎఫెక్ట్ చూపించిందని అన్నారు. పార్లమెంట్ లో 24% వ్యాపారవేత్తలు ఉన్నారని, వారంతా కూడా.. మౌనంగా ఉంటారని.. కానీ, తాను మాత్రం మౌనంగా ఉండలేనని గల్లా వ్యాఖ్యానించారు.
నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంట్ లో సైలెంట్ గా కూర్చోవడం తన వల్ల కాదన్నారు. “2024 ఎన్నికల్లో పోటీ చేయను. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ గా ఉండలేను కాబట్టి వ్యాపారులు చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతాను. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తిరిగి రాజకీయాల్లోకి వస్తాను.” అని గల్లా అన్నారు.
బిజినెస్ పార్ట్ టైమ్ గా చెయ్యొచ్చు కానీ.. రాజకీయాలు అలా చేయలేమని, ఫుల్టైమ్ దానికి ఇవ్వాల్సిందే నని గల్లా అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో తాను ఫుల్ టైం దానికి కేటాయించలేనన్నారు. వ్యాపారం అయినా, రాజకీయాలు అయినా దేశం కోసం మాత్రమే చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటుందని చెప్పారు.
This post was last modified on January 28, 2024 2:37 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…