Political News

షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉంది: ఉండవల్లి

ఏపీలో సీనియర్ పొలిటిషియన్, కాంగ్రెస్ హార్డ్ కోర్ అభిమాని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రిలో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి వెళ్లిన షర్మిల..ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే, ఉండవల్లిని కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే షర్మిలతో భేటీపై మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. షర్మిలతో రాజకీయాల గురించి చర్చించలేదని ఉండవల్లి వెల్లడించారు.

తన ఆశీస్సుల కోసం షర్మిల వచ్చారని, ఆమెకు తన సహకారం ఎల్లపుడూ ఉంటుందని ఆయన చెప్పారు. షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని, 2 నెలల్లో రానున్న ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో పాలన సమర్థవంతంగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్‌లో ఉన్న నడవడిక షర్మిలకు వచ్చిందని, వైఎస్సార్ కుమార్తెగా ఆమెకు గుర్తింపు ఉందని అన్నారు. ఏడేళ్ల క్రితం తన వద్దకు జగన్ వచ్చారని, జగన్ తో కొన్ని సార్లు మాట్లాడానని, పరిచయం ఉందని అన్నారు. కానీ, షర్మిలతో పెద్దగా మాట్లాడింది లేదని చెప్పారు. కుటుంబ కలహాలతో వారు విడిపోవటం సహజమని, రాజకీయాలు వేరని అన్నారు.

షర్మిలలో వైఎస్ఆర్ పోలికలున్నాయని, ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడగలిగే రాజకీయ చతురత ఉందని కితాబిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాల్సిన అవసరముందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలున్నాయని చెప్పారు. కాగా, ఉండవల్లి కుటుంబంతో వైఎస్ఆర్ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని షర్మిల చెప్పారు. ఉండవల్లిని మర్యాదపూర్వకంగానే కలిశానని, రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. వైఎస్సార్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లను తాను కలుస్తున్నానని చెప్పారు.

This post was last modified on January 25, 2024 11:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago