వైసీపీ నాయకుడు, యువ ఎంపీ, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో ఇమడలేక, పార్టీలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలోనే తాను రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. అయితే..ఇప్పుడు ఆయన చూపు టీడీపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది. లావు తండ్రి.. లావు పెదరత్తయ్య.. వాస్తవానికి టీడీపీకి అనుకూలం. వీరి యూవర్సిటీ ఏర్పాటు సహా అనేక సందర్భాల్లో టీడీపీ సర్కారు సహాయం చేసింది.
ఈ నేపథ్యంలో లావు పెదరత్తయ్య.. టీడీపీకి సానుకూలంగా వ్యవహరించారు. అయితే.. గత ఎన్నికలకు ముందు.. వైసీపీ లావు శ్రీకృష్ణదేవరాయులును పార్టీలోకి ఆహ్వానించి.. టికెట్ ఇచ్చింది. కానీ, ఐదేళ్లలోనే అంతర్గత సమస్యలు.. ఎంపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చారు. ఇక, లావుకు రాజకీయంగా చూస్తే ఎలాంటి మైనస్లు లేవు. అవినీతి ఆరోపణలు అసలే లేవు. ఆయన అభివృద్ది నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. దీంతో పేట పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లోనూ లావుకు ప్రజాభిమానం మెండుగానే ఉంది. ఇదే విషయాన్ని వైసీపీకి ఇక్కడి నాయకులు కూడా చెప్పారు. అయినప్పటికీ.. పార్టీ లావును ప్రాతిపదికగా తీసుకోలేదు. దీంతో ఆయన వెళ్లిపోయారు.ఇక, ఇప్పుడు టీడీపీ నేతలు ఆయనకు టచ్లో ఉన్నారని తెలిసింది. లావు తండ్రి కూడా.. టీడీపీవైపు వెళ్లాలని సూచించినట్టు సమాచారం.
కృష్ణదేవరాయులు కనుక టీడీపీలోకి వస్తే.. నరసరావుపేట పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కడం సునాయాసం అవుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన కు ఉన్న ఇమేజ్తోపాటు.. స్తానికంగా వివాద రహితుడు అనే పేరు కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా .. లావు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఆయన వస్తే.. టీడీపీ నరసరావు పేట టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉండడం గమనార్హం.
This post was last modified on January 24, 2024 8:57 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…