వైసీపీ నాయకుడు, యువ ఎంపీ, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో ఇమడలేక, పార్టీలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలోనే తాను రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. అయితే..ఇప్పుడు ఆయన చూపు టీడీపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది. లావు తండ్రి.. లావు పెదరత్తయ్య.. వాస్తవానికి టీడీపీకి అనుకూలం. వీరి యూవర్సిటీ ఏర్పాటు సహా అనేక సందర్భాల్లో టీడీపీ సర్కారు సహాయం చేసింది.
ఈ నేపథ్యంలో లావు పెదరత్తయ్య.. టీడీపీకి సానుకూలంగా వ్యవహరించారు. అయితే.. గత ఎన్నికలకు ముందు.. వైసీపీ లావు శ్రీకృష్ణదేవరాయులును పార్టీలోకి ఆహ్వానించి.. టికెట్ ఇచ్చింది. కానీ, ఐదేళ్లలోనే అంతర్గత సమస్యలు.. ఎంపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చారు. ఇక, లావుకు రాజకీయంగా చూస్తే ఎలాంటి మైనస్లు లేవు. అవినీతి ఆరోపణలు అసలే లేవు. ఆయన అభివృద్ది నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. దీంతో పేట పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లోనూ లావుకు ప్రజాభిమానం మెండుగానే ఉంది. ఇదే విషయాన్ని వైసీపీకి ఇక్కడి నాయకులు కూడా చెప్పారు. అయినప్పటికీ.. పార్టీ లావును ప్రాతిపదికగా తీసుకోలేదు. దీంతో ఆయన వెళ్లిపోయారు.ఇక, ఇప్పుడు టీడీపీ నేతలు ఆయనకు టచ్లో ఉన్నారని తెలిసింది. లావు తండ్రి కూడా.. టీడీపీవైపు వెళ్లాలని సూచించినట్టు సమాచారం.
కృష్ణదేవరాయులు కనుక టీడీపీలోకి వస్తే.. నరసరావుపేట పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కడం సునాయాసం అవుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన కు ఉన్న ఇమేజ్తోపాటు.. స్తానికంగా వివాద రహితుడు అనే పేరు కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా .. లావు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఆయన వస్తే.. టీడీపీ నరసరావు పేట టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉండడం గమనార్హం.
This post was last modified on January 24, 2024 8:57 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…