Political News

21న మొదటి జాబితా విడుదల ?

ఈనెల 21వ తేదీన టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదలకు ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. తొలిజాబితాలో టీడీపీ సిట్టింగుల్లో చాలామందికి టికెట్లు ఖాయంగా ఉంటాయని అంటున్నారు. సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని చంద్రబాబునాయుడు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా పట్టుబడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కందుల దుర్గేష్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీచేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు.

ఈ కారణంగా టీడీపీ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్ధితి అయోమయంలో పడింది. రాబోయే ఎన్నికల్లో పోటీచేయేది తానే అంటు ఇటు గోరంట్ల అటు కందుల ఇద్దరూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సీటును వదిలేసినా మిగిలిన 18 మందికి టికెట్లు ఖాయమనే అనుకుంటున్నారు. మొదటిజాబితాలో సుమారు 70 మంది అభ్యర్ధులు ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఇందులో టీడీపీ తరపున 50 మంది, జనసేన తరపున 20 మంది ఉంటారని సమాచారం.

రెండుపార్టీలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు ఇప్పటికే చంద్రబాబు, పవన్ స్ధాయిలో ఫైనల్ అయిపోయాయి. అయితే ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించలేదు. జనసేన నేతలేమో 60 నియోజకవర్గాల్లో పోటీచేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. అలాగే 8 లోక్ సభసీట్లు తీసుకోవాలని పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబేమో 25 అసెంబ్లీలు, 2 లేదా 3 పార్లమెంట్ స్ధానాలు ఇవ్వటానికి రెడీ అయినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యేమార్గంలో పవన్ 50 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంటు స్ధానాలు  కావాలని లిస్టు ఇచ్చారట.

పవన్, జనసేన నేతల డిమాండ్లకు చంద్రబాబు ఆఫర్ కు మధ్య చాలా వ్యత్యాసముంది. మరి దీన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి. ఈ జాబితాలోనే పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం కూడా ఉంటుందని అనుకుంటున్నారు. ఇది కాకుండా సుమారు 8 మంది పార్లమెంటు స్ధానాలను కూడా ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం. ఏదేమైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులను ఫైనల్ చేసేస్తున్నారు. తొందరలోనే టీడీపీ-జనసేన కూటమి కూడా రెడీ అవుతోంది. అంటే ఎన్నికల వేడి మరింతగా పెరిగిపోవటం ఖాయం. 

This post was last modified on January 15, 2024 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

3 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

3 hours ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

4 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

4 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

5 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

5 hours ago