Political News

ఆ రోజు కాంగ్రెస్ మా మాట విని ఉంటే.. ల‌గ‌డ‌పాటి

ఏపీ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపించే పేరు విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరే. ఆయ‌న ఎక్క‌డున్నారు.. ఏం చేస్తున్నారు.. అనేది ప‌క్క‌న పెడితే.. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌.. ఇలా ఆయ‌న ఎక్క‌డ మీడియాకు తార‌స‌ప‌డినా.. వెంట‌నే ఆయ‌న చుట్టూ రాజ‌కీయాలు ముసురుకుంటాయి. మీరు ఏ పార్టీలో చేరుతున్నారు? ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు? అంటూ.. మీడియా ఆయ‌న‌ను ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేయ‌డం.. తెలిసిందే. తాజాగా ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. ల‌గ‌డ‌పాటి ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్ర‌త్య‌క్షమ‌య్యారు.

దీంతో మీడియా ఆయ‌నను చుట్టేసింది. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం.. ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తుండడం.. మరోవైపు.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు ల‌గ‌డ‌పాటి వంటి బ‌ల‌మైన నాయ‌కుల కోసం ఎదురు చూస్తుండ‌డంతో ఇవే ప్ర‌శ్నల‌కు మీడియా ఆయ‌న‌కు సంధించింది. అయితే.. ఆయ‌న మాత్రం య‌ధాలాపంగా తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నాన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాదు.. భ‌విష్య‌త్ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయాల‌ని భావించ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ తోనే అయిపోయింది. ఆ రోజు మా మాట విని ఉంటే.. పార్టీ ప‌రిస్థితి, మా ప‌రిస్థితి వేరేగా ఉండేది అని ల‌గ‌డ‌పాటి అన్నారు.

వారిద్ద‌రికీ సాయం

ఇక‌, తాను రాజ‌కీయాల్లో దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌రీష్‌కుమార్‌కు, రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ల‌కు తాను ఎప్పుడూ చేరువ‌గానే ఉంటాన‌ని ల‌గ‌డ‌పాటి చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. తాను వ‌చ్చి ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఇంత‌కుమించి తాను ఏమీ చెప్పేది లేద‌న్నారు. అయితే..ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటే మంచిదేన‌ని అన్నారు. తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి రావ‌డం ఆనందంగానే ఉంద‌న్నారు.

జోస్యం విఫ‌లం కావ‌డంతో..

2019 ఎన్నిక‌ల‌కు ల‌గ‌డ‌పాటి ఓ ప్ర‌ముఖ టీవీ చానెల్‌తో క‌లిసి ఏపీలో స‌ర్వే చేశారు. దీనికి సంబంధించి ఆయ‌న ఫ‌లితాలు వెల్ల‌డించారు. ఏపీలో ప్ర‌జ‌లు మ‌రోసారి చంద్ర‌బాబునే కోరుకుంటున్నార‌ని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంద‌ని చెప్పారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖ‌చ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడ‌తార‌ని అన్నారు. ఈ జోస్యం త‌ప్ప‌యితే.. ఇక నుంచి తాను స‌ర్వేలు చేయ‌న‌ని అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌క‌టించారు అయితే.. అనూహ్యంగా ల‌గ‌డ‌పాటి చెప్పిన ఈక్వేష‌న్ రాంగ‌యింది. దీంతో ఆయ‌న అటు రాజ‌కీయాలు. ఇటు సర్వేల‌కు కూడా గుడ్‌బై చెప్పారు.

This post was last modified on January 8, 2024 10:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

26 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

7 hours ago