Political News

ఆ రోజు కాంగ్రెస్ మా మాట విని ఉంటే.. ల‌గ‌డ‌పాటి

ఏపీ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపించే పేరు విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరే. ఆయ‌న ఎక్క‌డున్నారు.. ఏం చేస్తున్నారు.. అనేది ప‌క్క‌న పెడితే.. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌.. ఇలా ఆయ‌న ఎక్క‌డ మీడియాకు తార‌స‌ప‌డినా.. వెంట‌నే ఆయ‌న చుట్టూ రాజ‌కీయాలు ముసురుకుంటాయి. మీరు ఏ పార్టీలో చేరుతున్నారు? ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు? అంటూ.. మీడియా ఆయ‌న‌ను ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేయ‌డం.. తెలిసిందే. తాజాగా ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. ల‌గ‌డ‌పాటి ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్ర‌త్య‌క్షమ‌య్యారు.

దీంతో మీడియా ఆయ‌నను చుట్టేసింది. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం.. ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తుండడం.. మరోవైపు.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు ల‌గ‌డ‌పాటి వంటి బ‌ల‌మైన నాయ‌కుల కోసం ఎదురు చూస్తుండ‌డంతో ఇవే ప్ర‌శ్నల‌కు మీడియా ఆయ‌న‌కు సంధించింది. అయితే.. ఆయ‌న మాత్రం య‌ధాలాపంగా తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నాన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాదు.. భ‌విష్య‌త్ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయాల‌ని భావించ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ తోనే అయిపోయింది. ఆ రోజు మా మాట విని ఉంటే.. పార్టీ ప‌రిస్థితి, మా ప‌రిస్థితి వేరేగా ఉండేది అని ల‌గ‌డ‌పాటి అన్నారు.

వారిద్ద‌రికీ సాయం

ఇక‌, తాను రాజ‌కీయాల్లో దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌రీష్‌కుమార్‌కు, రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ల‌కు తాను ఎప్పుడూ చేరువ‌గానే ఉంటాన‌ని ల‌గ‌డ‌పాటి చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. తాను వ‌చ్చి ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఇంత‌కుమించి తాను ఏమీ చెప్పేది లేద‌న్నారు. అయితే..ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటే మంచిదేన‌ని అన్నారు. తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి రావ‌డం ఆనందంగానే ఉంద‌న్నారు.

జోస్యం విఫ‌లం కావ‌డంతో..

2019 ఎన్నిక‌ల‌కు ల‌గ‌డ‌పాటి ఓ ప్ర‌ముఖ టీవీ చానెల్‌తో క‌లిసి ఏపీలో స‌ర్వే చేశారు. దీనికి సంబంధించి ఆయ‌న ఫ‌లితాలు వెల్ల‌డించారు. ఏపీలో ప్ర‌జ‌లు మ‌రోసారి చంద్ర‌బాబునే కోరుకుంటున్నార‌ని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంద‌ని చెప్పారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖ‌చ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడ‌తార‌ని అన్నారు. ఈ జోస్యం త‌ప్ప‌యితే.. ఇక నుంచి తాను స‌ర్వేలు చేయ‌న‌ని అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌క‌టించారు అయితే.. అనూహ్యంగా ల‌గ‌డ‌పాటి చెప్పిన ఈక్వేష‌న్ రాంగ‌యింది. దీంతో ఆయ‌న అటు రాజ‌కీయాలు. ఇటు సర్వేల‌కు కూడా గుడ్‌బై చెప్పారు.

This post was last modified on January 8, 2024 10:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

5 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

25 mins ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

10 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

14 hours ago