Political News

తెలంగాణలో అతి తక్కువ పాజిటివ్ కేసులు

మూడు రోజుల క్రితమే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి క్రాస్ చేయటం ఖాయమనుకున్న అంచనాలు తప్పు అయ్యాయి. శనివారం రాత్రి నాటి అతి తక్కువ కేసులు నమోదు కావటంతో వెయ్యి కేసులకు మరో పది కేసులు నమోదైతే తప్పించి ట్రిపుల్ ఫిగర్ ను దాటే అవకాశం ఉంది.

ఆ మధ్యన పెద్ద ఎత్తున కేసులు నమోదైన దానికి భిన్నంగా గడిచిన మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. శనివారం మరింత తక్కువగా.. సింగిల్ డిజిట్ కే పరిమితం కావటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా నమోదైన ఏడు కేసుల్లో ఆరు కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాగా.. వరంగల్ లో ఒక కేసు నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో శనివారం కేసులే నమోదు కాలేదు.

మొత్తంగా చూస్తే.. తెలంగాణలో శనివారం రాత్రి నాటికి 990 కేసులు వెలుగు చూడగా.. అందులో 307 మంది డిశ్చార్జి కాగా.. మరో పాతిక మంది ఇప్పటివరకూ మరణించారు. అంటే ఇప్పటికిప్పుడు ఉన్న యాక్టివ్ కేసులు 658 మాత్రమేనని చెప్పాలి. కొత్త కేసులు నమోదు కాని పక్షంలో రానున్న రెండు వారాల్లో పెద్ద ఎత్తున డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.

అదే జరిగితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమపద్దతిలో తగ్గే వీలుంది. విదేశాల నుంచి వచ్చిన వారితో మొదలైన కరోనా కేసులు.. మర్కజ్ పుణ్యమా మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం చుట్టుపక్కల రాకపోకల్ని బంద్ చేయటంతో పాటు.. కంటైన్ మెంట్ కేంద్రాలుగా గుర్తించి.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవటం షురూ చేసింది.

అదే సమయంలో.. పాజిటివ్ కేసుల కాంటాక్టును గుర్తించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి.. జల్లెడ పట్టింది. ఈ చర్యలు ఇప్పుడిప్పుడు సత్ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇలాంటివేళ.. సూర్యాపేట.. జోగులాంబ-గద్వాల.. వికారాబాద్ జిల్లాల్లో నమోదైన కొత్త కేసులతో తెలంగాణలో పాజటివ్ కేసుల సంఖ్య పెరిగింది.

వాటి కట్టడికి తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలే.. శనివారం నాటికి అతి తక్కువ కేసులు నమోదు కావటానికి కారణంగా చెబుతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి పెరిగిన తర్వాత.. ఒకరోజులో సింగిల్ డిజిట్ కే పాజిటివ్ కేసులు పరిమితం కావటం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 113 కుటుంబాల్లో నమోదైన కేసులో తెలంగాణలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావటానికి కారణంగా చెప్పాలి. హైదరాబాద్ లో 44 కుటుంబాల నుంచి 268 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సూర్యాపేట జిల్లాలో పాతిక కుటుంబాల నుంచి 83 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.

గద్వాల జిల్లాలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా రాగా.. వికారాబాద్ జిల్లాలో 14 కుటుంబాల నుంచి 38 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం మాదిరే మరో వారం రోజులు తక్కువ మోతాదులో పాజిటివ్ లు నమోదైతే.. కరోనా ముప్పు నుంచి తెలంగాణ బయటపడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on April 26, 2020 12:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

42 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago