Political News

తెలంగాణలో అతి తక్కువ పాజిటివ్ కేసులు

మూడు రోజుల క్రితమే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి క్రాస్ చేయటం ఖాయమనుకున్న అంచనాలు తప్పు అయ్యాయి. శనివారం రాత్రి నాటి అతి తక్కువ కేసులు నమోదు కావటంతో వెయ్యి కేసులకు మరో పది కేసులు నమోదైతే తప్పించి ట్రిపుల్ ఫిగర్ ను దాటే అవకాశం ఉంది.

ఆ మధ్యన పెద్ద ఎత్తున కేసులు నమోదైన దానికి భిన్నంగా గడిచిన మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. శనివారం మరింత తక్కువగా.. సింగిల్ డిజిట్ కే పరిమితం కావటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా నమోదైన ఏడు కేసుల్లో ఆరు కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాగా.. వరంగల్ లో ఒక కేసు నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో శనివారం కేసులే నమోదు కాలేదు.

మొత్తంగా చూస్తే.. తెలంగాణలో శనివారం రాత్రి నాటికి 990 కేసులు వెలుగు చూడగా.. అందులో 307 మంది డిశ్చార్జి కాగా.. మరో పాతిక మంది ఇప్పటివరకూ మరణించారు. అంటే ఇప్పటికిప్పుడు ఉన్న యాక్టివ్ కేసులు 658 మాత్రమేనని చెప్పాలి. కొత్త కేసులు నమోదు కాని పక్షంలో రానున్న రెండు వారాల్లో పెద్ద ఎత్తున డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.

అదే జరిగితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమపద్దతిలో తగ్గే వీలుంది. విదేశాల నుంచి వచ్చిన వారితో మొదలైన కరోనా కేసులు.. మర్కజ్ పుణ్యమా మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం చుట్టుపక్కల రాకపోకల్ని బంద్ చేయటంతో పాటు.. కంటైన్ మెంట్ కేంద్రాలుగా గుర్తించి.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవటం షురూ చేసింది.

అదే సమయంలో.. పాజిటివ్ కేసుల కాంటాక్టును గుర్తించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి.. జల్లెడ పట్టింది. ఈ చర్యలు ఇప్పుడిప్పుడు సత్ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇలాంటివేళ.. సూర్యాపేట.. జోగులాంబ-గద్వాల.. వికారాబాద్ జిల్లాల్లో నమోదైన కొత్త కేసులతో తెలంగాణలో పాజటివ్ కేసుల సంఖ్య పెరిగింది.

వాటి కట్టడికి తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలే.. శనివారం నాటికి అతి తక్కువ కేసులు నమోదు కావటానికి కారణంగా చెబుతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి పెరిగిన తర్వాత.. ఒకరోజులో సింగిల్ డిజిట్ కే పాజిటివ్ కేసులు పరిమితం కావటం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 113 కుటుంబాల్లో నమోదైన కేసులో తెలంగాణలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావటానికి కారణంగా చెప్పాలి. హైదరాబాద్ లో 44 కుటుంబాల నుంచి 268 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సూర్యాపేట జిల్లాలో పాతిక కుటుంబాల నుంచి 83 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.

గద్వాల జిల్లాలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా రాగా.. వికారాబాద్ జిల్లాలో 14 కుటుంబాల నుంచి 38 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం మాదిరే మరో వారం రోజులు తక్కువ మోతాదులో పాజిటివ్ లు నమోదైతే.. కరోనా ముప్పు నుంచి తెలంగాణ బయటపడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on April 26, 2020 12:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…

55 seconds ago

ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…

6 minutes ago

ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?

రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…

44 minutes ago

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…

2 hours ago

ప్రేక్షకుల పట్ల బాధ్యత లేదా?

గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…

2 hours ago

జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…

3 hours ago